కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు కూడా తమ గళాన్ని వినిపించాలని ఆయన సూచనలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన రీతిలోనే పార్టీ ఎంపీలు, కేబినెట్ మంత్రులు తమ భయాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంపై మాట్లాడేందుకు ముందుకు రావాలని హితవు పలికారు.
ప్రస్తుత పరిస్థితులు 1975-77లోని ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని నలుగురు జడ్జిలు చేసిన వ్యాఖ్యలపై యశ్వంత్ సిన్హా స్పందిస్తూ, పార్లమెంటు రాజీ పడితే సుప్రీంకోర్టు సరైన రీతిలో నడవకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రజాసామ్యానికి ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు చెప్పినప్పుడు వారి మాటలను క్యాబినెట్ మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. అప్రజాస్వామికంగా జరుగుతున్న అన్ని చర్యలను ఎండగట్టాలని, అందుకు ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు వుందని అన్నారు.
బీజేపీ నేతలు, సీనియర్ కేబినెట్ మంత్రులనూ మాట్లాడాలని తాను కోరుకుతున్నానన్నారు. భయాలన్నీ పక్కనపెట్టి నోరు విప్పాలని ఆయన అన్నారు. 'ఈ ప్రభుత్వంలో భయంతో పని చేస్తున్న కేబినెట్ మంత్రుల గురించి నాకు తెలుసు. భయం గుప్పిట్టో పనిచేయడం కూడా ప్రజాస్వామ్యానికి ముప్పే' అని ప్రభుత్వంపై యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. సిన్హా గతంలోనూ మోదీ సర్కార్ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీపైనా ఘాటు విమర్శలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 26 | రాజీనామా ఆమోదం పొందాక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రజల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా యాజిలిలో రైతులతో సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్న తరుణంలో యాజిలి రైతులతో లక్ష్మీనారాయణ భేటీ కావడం ప్రధాన్యత సంతరించుకుంది.... Read more
Apr 26 | జనసేన పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలతో ముందుకెళ్లాలని, తమ జనసైనికులను భయపట్టాలని కొన్ని స్వార్థపూరిత శక్తుల దుష్ట పన్నాగాలను పోలీస్ నిఘావర్గాలు పసిగట్టాయని జనసేన పార్టీ తెలిపింది.... Read more
Apr 26 | దేశప్రజలు అచరిస్తున్న పాత పద్దతులు, విధానాలే నోట్ల కష్టాలకు కారణాలను అర్బీఐ తాజాగా వెల్లడించింది. 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేపట్టిన క్రమంలో ప్రజలు ఎదుర్కొన్న కరెన్సీ కష్టాలు అరు మాసాలైన తరువాత... Read more
Apr 26 | ధేశరాజధాని ప్రాంతంతో పాటు సమీపంలోని ఉత్తరప్రదేశ్ లో సంభవించిన రెండు ఘోర ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. ఇవాళ ఉదయం ఢిల్లీలోని పశ్చిమ ప్రాంతంలోగల కన్హయ్యనగర్ మెట్రో రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ పాల వ్యాను... Read more
Apr 26 | దైవ స్వరూపిణిగా ప్రచారం చేసుకుంటున్న వివాదాస్పద అధ్యాత్మిక గురువు రాధేమా మరోమారు వార్తల్లో నిలిచారు. ఓ వైపు దైవ స్వరూపమని ప్రచారం చేసుకున్నే ఈ గురువుకు శాశ్వతమైన దైవమందే తమ చిత్తం వుంచాల్సింది పోయి..... Read more