Kashmiri militants killed in encounters 'martyrs' పీడిపీ ఎమ్మెల్యే దేశద్రోహ వ్యాఖ్యలు..

Pdp mla kashmiri militants killed in encounters martyrs

Kashmir, Peoples Democratic Party, Mukhtar Abbas Naqvi, bharatiya janata party, Jammu, terrorists are martyrs, jamm and kashmir, Aijaz Ahmed Pir, pdp mla, militants martyr, Indian Army, Jawans, j and k assembly, kashmir news, national news

The PDP MLA's statement comes a day after he had asked legislators in the J&K Assembly not to express happiness over the killing of militants as they too were “brothers”.

పీడిపీ ఎమ్మెల్యే దేశద్రోహ వ్యాఖ్యలు.. చర్యలకై డిమాండ్

Posted: 01/11/2018 07:13 PM IST
Pdp mla kashmiri militants killed in encounters martyrs

దేశంలో వేర్పాటువాదంలో అలజడి సృష్టిస్తూ.. భారత జవాన్ల ప్రాణాలను తీస్తున్న ఉగ్రవాదులకు సానుకూలంగా వ్యాఖ్యలు చేసి జమ్మూకాశ్మీర్ లోని అధికార పిడీపి ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మిర్ దేశద్రోహానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు తమ సోదరులని.. భద్రతా దళాల చేతుల్లో హతమవుతున్న వాళ్లు అమరవీరులని ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హురియత్, వేర్పాటువాదులు, ఉగ్రవాదులతో మాట్లాడి కశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని అల్లర్లను నిలువరించాలంటే వారితో చర్చలు జరపాలి. మీరు వాళ్లని ఉగ్రవాదులు లేదా ఇంకేమైనా పిలవండి. కానీ వాళ్లందరూ కశ్మీరీలు.. మా సోదరులు. వాళ్లు చనిపోవడాన్ని రాజకీయం చేయొద్దని అందరినీ అభ్యర్థిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే ఐజాజ్ ఉగ్రవాదులను వెనకేసుకొస్తూ మాట్లాడటం పట్ల బీజేపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బాధ్యత గల పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇటు నెట్ జనులు కూడా ఆయన వ్యాఖ్యలపై కామెంట్లు చెస్తున్నారు. రాజద్రోహం కేసులను బనాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై తక్షణం అనర్హత వేటు వేయాలని కూడా నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles