రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో వున్నవాళ్లు తలచుకుంటే ఏమైనా జరిగిపోతుంది. ఆ మధ్యకాలంలో రిలయన్స్ జియో లాంఛనంగా ప్రారంభించే క్రమంలో పారిశ్రామిక వేత్త జియోకు ప్రధాని నరేంద్రమోడీని బ్రాండ్ అంబాసిడర్ గా పేర్కొంటూ దినపత్రికలలో ఇచ్చిన ప్రకటనపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తే.. ఆ భారతీయ కుబేరుడికి కేవలం ఐదువేల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
అనుమతి లేకుండా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను తమ ప్రకటనలలో వాడుకున్నందుకు గాను ఈ జరిమానా విధించారు. ఇక తాజాగా పాలకపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా తన పెళ్లి కార్డులో ప్రభుత్వ లోగానే వేయించుకున్నాడు. తన పెళ్లిని కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేసుకున్నాడు. తన పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకున్న శాసన సభ్యుడు.. ముఖ్యమంత్రి, మంత్రులు, కూడా తమ ఇంట్లో పెళ్లికి చేయని విధంగా ఏకంగా పెళ్లికార్డులపైనే రాష్ట్ర ప్రభుత్వ లోగోనే ముద్రించేసి అధికారికం చేసుకున్నారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా జ్వాలాపూర్ నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్కు పెళ్లి కుదిరింది. ఎమ్మెల్యే పెళ్లి అంటే మాటలా.. వివాహ ఆహ్వాన పత్రికను బ్రహ్మాండంగా తయారుచేయించారు. అంతేనా? శుభలేఖ ఎడమవైపున పైభాగంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ లోగోను ముద్రించారు. కింద తన పేరు వేయించుకున్నారు. ప్రభుత్వ లోగోను శుభలేఖపై వాడుకోవడంపై రాథోడ్ స్పందించాడు. తాను చేసింది నేరమేమీ కాదని సమర్థించుకున్నారు.
ప్రభుత్వంలో తాను కూడా భాగమేనని పేర్కొన్న ఆయన, గతంలోనూ ఎంతోమంది ఇలా ప్రభుత్వ లోగోను అచ్చు వేయించుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శిస్తున్న వారు తానో పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. నిజానికి ప్రభుత్వ చిహ్నాలను వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడం నేరం. ఉపయోగించుకోవాలని ముచ్చటపడితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఇలా లోగోను అచ్చేయించడంతో విమర్శల పాలవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more