వాహనదారులను ఎప్పటిఅప్పుడు అలర్ట్ చేసి,.. అవగాహన కల్పించడంలో హైదరాబాద్ పోలీసులు ఓ అడుగు ముందేవున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన నేపథ్యంలో మరోమారు సోషల్ మీడియా వేదికగా నగర వాహనదారులను అప్రమత్తం చేసి.. అవగాహన కల్పించే చర్యలకు పూనుకున్నారు. అదేంటి అంటారా.? పెట్రోల్ బంక్ వద్ద మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని అటు పెట్రోల్ బంకు యాజమాన్యాలు.. ఇటు పోలీసులు ఎంతగా చెప్పినా లక్ష్యపెట్టిన పాపానపోరు కొందరు వాహనదారులు.
ఇప్పటికే పెట్రోల్ బంకు వద్ద మొబైల్ ఫోన్ మాట్లాడితే ఏం జరుగుతుందన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోలీసులు.. తాజాగా హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకులో చోటుచేసుకున్న మరో ఘటనకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు పోలీసులు. నిబంధనలు తమకు వర్తించవు అంటూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే పలువురు ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సి వుంది. లేదా నెక్స్ట్ మీరే కావచ్చు.
ఇక హైదరాబాద్ పోలీసులు ట్వట్టర్ వేదికగా పోస్టు చేసిన వీడియోలో ఏముంది అంటారా..? ఓ ద్విచక్రవాహనదారుడు తన కుమారుడితో కలిసి పెట్రోల్ బంకుకి వచ్చి తన వాహనంలో పెట్రోల్ పోయించుకుంటున్నాడు. ఈ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైకుకి అంటుకున్నాయి. ఆ బైకుపై కూర్చున్న చిన్నారి కాలికి కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే పెట్రోల్ బంకులో వున్నవారంతా ఉరుకులు పరుగులు తీశారు. అలా పరుగు తీస్తున్న ఓ ముస్లిం మహిళ.. కొంత దూరం వెళ్లి అగి ధైర్యంగా తన చేతిలోని బ్యాగుతో మంటలను అర్పే ప్రయత్నం చేసింది.
Don't Use Mobile phone at Petrol Pump pic.twitter.com/AXj9BV82og
— hyderabadpolice (@hydcitypolice) December 14, 2017
ఇక ఫైర్ ఎస్టింగ్విషర్ ను తీసుకురావాల్సిన బంకు సిబ్బంది.. పరుగు పెట్టి పెట్రల్ బంకు పక్కకు వచ్చి నిలబడ్డాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో పోలీసులు తెలపలేదు. పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు అనునిత్యం అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే తరంగాలు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ హైఎనర్జీని మోసుకొస్తాయి. చిన్న రాపిడికి కూడా స్పందించగల పెట్రోల్ ను సెల్ ఫోన్ ద్వారా వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ ప్రభావితం చేయగలదు. దీనివల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more