వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తనకు ఎలాంటి వైరం లేదని జనసేన అధినేత పనవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. చలోరే చలరే చల్ పర్యటన కార్యక్రమంలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన జనసేన సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ తన లభిప్రాయాలను పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన తనకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వైసీకి మధ్య వైరం వుందన్న వార్తలను ఖండించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రడ్డి చేసిన పలు ప్రజాహిత కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు.
రాజశేఖర్ రెడ్డి ప్రజాహిత కార్యక్రమాలతో రాష్ట్రంలో అనేక మంది ప్రజలు లబ్ధి చేకూర్చాయని అన్నారు. అయితే అదే రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతిని కూడా ఆయన ప్రస్తావించారు. రాజకీయాల్లో పరిపూర్ణమైన మంచిని ఆశించలేము. రాజకీయాల్లో కొంతమంది వేలకోట్ల డబ్బును వెనకేసుకున్నారు. ప్రజలు మాత్రం తమ ఇబ్బందులను ఎదుర్కొంటనే వున్నారు. మధా రాజా తథా ప్రజా అన్నట్లు రాజు ఎలా వుంటే ప్రజలు కూడా అదే బాటలో నడుస్తారని అభిప్రాయపడ్డారు.
తన తండ్రి మరణానంతరం తాను ముఖ్యమంత్రి కావాలని అప్పటికప్పుడు పథకాలు రచించిన జగన్ నిర్ణయం అవివేకమని అన్నారు. రాజకీయ నేతల వారుసులు తమ ప్రతిభను చాటుకున్న తరువాతే రాజకీయాల్లోకి ప్రవేశించాలని చెప్పారు. ఈ విషయంలోనే తాను జగన్ పార్టీని వ్యతిరేకిస్తాను తప్ప.. మరేవిధమైన వైరం మాత్రం లేదని చెప్పారు. జగన్ అంటే నాకు వ్యక్తిగతంగా ఏ మాత్రం వ్యతిరేకత లేదని వెల్లడించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమా..? లేదా..? అన్న విషయంలో మాత్రం పవన్ స్పష్టతను ఇవ్వలేదు. ఇక ప్రతిపక్ష పార్టీగా గత మూడేళ్లుగా జగన్ తన ప్రతిభను చాటుకున్నారా..? అన్న అంశంపై కూడా పవన్ క్లారిటీ ఇవ్వలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more