పెద్ద నోట్ల రద్దు చేపట్టి దాదాపుగా ఏడాది పూరైంది. ఈ నేపథ్యంలో మొదట రెండు వేల రూపాయల కొత్త పెద్ద నోటును భారతీయ వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ తరువాత కొత్తగా ముద్రించిన రూ.500 నోటును మూడు నెలల వ్యవధిలో ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికీ ఈ రెండు నోట్లు మాత్రమే యావత్ దేశ ప్రజలకు అందుబాటులో వున్నాయి. వీటి తరువాత కొత్తగా ముద్రించిన రూ.200 నోటును కేంద్రం భారత వ్యవస్థలో ప్రవేశపెట్టినా.. అవి ఎలా వుంటాయి.. ఎక్కడ లభ్యమవుతాయన్న విషయం మాత్రం ఇప్పటికీ చూడని మెట్రో నగరవాసులు అనేకమంది వున్నారంటూ అతిశయోక్తి కాదేమో. కొత్త రూ,. 50 నోటుపై కూడా ఇలాంటి అభిప్రాయలే వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు మరో కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోందన్న ప్రచారం జోరందుకుంది. వంద డినామినేషన్లో కాకుండా కొత్తగా అలోచించిన అర్బీఐ సరికొత్తగా.. కొత్త రూ.350 నోటును మార్కెట్లోకి విడుదల చేస్తుందని... త్వరలోనే రూ.2000 నోటును నిలుపుదల చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాక కొత్తగా తీసుకురాబోతున్న రూ.350 నోటు ఇలానే ఉండబోతుందంటూ మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు కూడా. ఈ వార్తపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. ఇదంతా తప్పుడు వార్త అంటూ తేల్చి చెప్పింది. అంతేకాక సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించింది.
మార్ఫింగ్ చేసిన విడుదల చేసిన రూ.350 నోటు ఇమేజ్... వైల్డ్ రెడ్ కలర్ లో, ఆశ్చర్యకరమైన నమూనాల్లో ఉన్నాయి. ఈ నోటును కొత్త రూ.200, రూ.50 నోట్లను మార్ఫింగ్ చేసి రూపొందించినట్టు తెలిసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. ఈ ఇమేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవడంతో, నిజంగానే ఆర్బీఐ కొత్తగా రూ.350 నోటు తీసుకొస్తుందేమోనని ప్రజలు భావించారు. కానీ ఇదంతా తప్పుడు వార్తనేనని ఆర్బీఐ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్నది అంతా అబద్దం అని.. ఎవరూ నమ్మొద్దని వెల్లడించింది. రూ.350 నోటు విడుదల చేసే ఆలోచన, ఉద్దేశం లేదని వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more