రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాను పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోనని.. ఎంపీలను కరివేపాకుల్లా చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి.. అప్పుడే మరో బాంబు కూడా పేల్చారు. తాను వద్దని విదుల్చుకుంటున్న దాన్ని తన కోడుకు అశపడుతున్నాడని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎంపీ పదవికి పోటీ చేస్తాడని కూడా చెప్పారు. అయితే పవన్ కల్యాన్ పార్టీ విషయమై ప్రప్తావన తీసుకువచ్చిన జేసీ.. చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేయకపోయివుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు.
అయితే తాజాగా జేసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తన కుమారుడు, యువనేత పవన్ రెడ్డి విభేధించారు. జనసేన పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న సందర్భంగా రాష్ట్రంలో అనేక రాజకీయ సమీకరణల్లో మార్పులు వస్తాయని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అయితే పవన్ కల్యాన్ ఒంటిరిగా బరిలోకి దిగనున్నారా..? లేక మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకోనున్నారా.. అన్న అంశాలపై మాత్రం ఇంకా క్లారిటీ లేని సందర్భంగా తాను అప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు.
కాగా, రానున్న ఎన్నికలలో పవన్ ఇతర పార్టీలతో కలసి పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే మాత్రం తమ ప్రాంత ఓట్లన్నీ పవన్ కల్యాన్ పార్టీ జనసేన ఖాతాలోకే వెళ్తాయని అభిప్రాయపడ్డారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికలలో తనకు 2019 అసెంబ్లీకి బదులు పార్లమెంటుకు పోటీ చేయాలన్న అకాంక్ష వుందని, పార్లమెంట్ కు పోటీ చేసి గెలిస్తేనే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయవచ్చన్నది తన అభిమతమని పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేని వ్యక్తినని అన్నారు.
రాజకీయాల్లోకి వస్తున్న పవన్ పోత్తుతో వస్తే మాత్రం తమ ప్రాంతంలోని సీట్లు జనసేనకు వెళతాయని ఆయన అంచనా వేశారు. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం తదితర నియోజకవర్గాల్లో రాజకీయాలు మరో ఏడాదిన్నరలో ఎంతో మారనున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక తాను మాత్రం పార్లమెంట్ సెగ్మెంట్ పైనే దృష్టిని పెట్టానని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని అన్నారు, తన తండ్రి అన్నా ఆయనకు అభిమానం ఉందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి వుంటామని అన్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఆయనతో మాట్లాడలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ కు తిక్కలేదని, లెక్క మాత్రం ఉందని పవన్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more