ఆధార్ వ్యక్తిగత గోప్యత అంటూ ఓ వైపు స్వరోన్నత న్యాయస్థానం తీర్పును స్పష్టం చేసినా.. దానిని తప్పనిసరిగా అరు సర్వీసులకు అనుసంధానం చేయాలని ప్రభుత్వ ఇప్పటికే అదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో.. మరింత గడువు లభిస్తుందా..? లేక ఇదే చివరి తేదిగా ప్రకటించనుందా..? అన్న అనుమానాలు వ్యక్తమతున్నక్రమంలో ఆరు సర్వీసులకు మాత్రం తుది గడువు దగ్గరకు వచ్చేసింది. 2017, డిసెంబర్ 31 తర్వాత వీటికి ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే చెల్లింపులు నిలిచిపోనున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా వచ్చే లబ్దిని పొందలేరు. మీ కార్డులు చెల్లుబాటుకావు.
2017, డిసెంబర్ 31తో ఆధార్ లింక్ చేయాల్సిన లిస్ట్ ఇలా ఉంది :
పాన్ కార్డు
బ్యాంక్ అకౌంట్
ప్రభుత్వ పథకాలు (రేషన్, పెన్షన్, ఉచిత వైద్యం, ఫీ రీయింబర్స్ మెంట్)
బీమా పాలసీలు
క్రెడిట్ కార్డులు
పోస్టాఫీస్ పథకాలు
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ షేర్లు
2018, జనవరి 1 తర్వాత వీటిని ఆధార్ తో లింక్ చేయకపోతే మీరు బీమా చెల్లింపులు చేయలేరు. అదే విధంగా బీమా మొత్తాలను పొందలేరు. ఐటీ రిటర్న్ లను పరిశీలించరు. రిటర్న్ లను ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కాలంలో బ్యాంక్ ఖాతా, బీమా పాలసీలు కామన్. నెలాఖరులోగా ఆధార్ లింక్ చేయకపోతే లావాదేవీలు నిలిపేవేసే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ఉన్న ఆధార్ నెంబర్ లింక్ చేయాలని రోజూ SMS మెసేజ్ ఇస్తున్నారు. జనవరి తర్వాత కార్డు ద్వారా లావాదేవీలు జరగపటంపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది
ఇప్పటికే మీరు గృహరుణాలు, ఇతర ఫైనాన్స్ సంస్థల తీసుకున్న అప్పుకి కూడా ఆధార్ అనుబంధానం చేయాలి. లేకపోతే ఆయా ఖాతాల ద్వారా లాదేవీలు ఆగిపోనున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందే వారు అంటే పెన్షన్, రేషన్, ఫీజు రీయింబర్స్ మెంట్ పొందాలంటే కచ్చితంగా డిసెంబర్ 31, 2017లోగా ఆయా ఖాతాలకు అధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి. లేకపోతే వాటి ప్రయోజనాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more