ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు శుభవార్త. ఇకపై ఫీఎఫ్ చందదారుల ఖాతాల్లో ‘ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్’ (ఈటీఎఫ్)లను జమ చేయాలని ‘ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్ వో) నిర్ణయించింది. అయితే ఇది అందరికీ కాదండోయ్. కేవలం తమ ఖాతాలోని డబ్బులను ఎక్చేంజీ ద్వారా వ్యాపారం చేసిన వారికి మాత్రమేనని సమాచారం. దీంతో ఇక రానున్న మార్చి మాసాంతానికి చందాదారులు తమ ఖాతాలకు ఎన్ని ఈటీఎఫ్ యూనిట్లు వచ్చాయో చూసుకోగల వీలుంటుంది. ఈ మేరకు ఐఐఎంతో చర్చించిన మీదట ఈక్విటీ సాధనాల విలువ లెక్కింపు, చందాదారులకు వాటిని బదలాయించడంపై ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకొంది.
ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. కాగ్ చేసిన పరిశీలనను కూడా గణాంక విధానంలో చేర్చినట్లు చెప్పారు. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) ద్వారా కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థను అమలు చేసే ప్రతిపాదననూ ఆమోదించామని తెలిపారు. ప్రస్తుత విధానంలో లావాదేవీ రుసుములు ఎక్కువగా ఉండడమే కాకుండా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎన్పీసీఐ ద్వారా జరిగే లావాదేవీలు అదేరోజు పూర్తవుతాయని చెప్పారు.
తమ సొమ్ము నుంచి అడ్వాన్స్ తీసుకున్నప్పుడు, లేదా తమ ఖాతాను పూర్తిగా పరిష్కరించుకున్నప్పుడు చందాదారుల ఈపీఎఫ్వో... వారి ఈటీఎఫ్ యూనిట్లను నగదుగా మారుస్తుందని కార్మికశాఖ కార్యదర్శి ఎం.సత్యవతి తెలిపారు. ఈ యూనిట్లతో చందాదారులు నేరుగా ట్రేడింగ్ చేయలేరనీ, ఇందుకు సమ్మతిస్తూ వారి ధరఖాస్తు అందిన క్రమంలో కేంద్రీయ సంస్థే వాటిని నగదుగా మారుస్తుందనీ వివరించారు. 2015 ఆగస్టు నుంచి ప్రారంభమైన ఈటీఎఫ్ నిధుల్ని మదుపు ప్రక్రియలో ఇప్పటివరకు రూ.32 వేల కోట్లను జమ అయ్యిందని, వీటిపై 21.87% చొప్పున ప్రతిఫలం లభించిందని సత్యవతి అంచనా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more