దేశంలో స్వచ్ఛాభారత్ మిషన్ ఎక్కడ కనిపిస్తుందని అడిగితే ఏ తరగతి పాఠశాల విద్యారథైనా ఠక్కున చెప్పేస్తారు టీవీలో అని. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న స్వచ్ఛాభారత్ అక్టోబర్ రెండు ప్రముఖుల ఫోటోలకు, వీడియోల కోసం చేసే హాడావిడికి పరిమితం అవుతుంది. అంతేకానీ నిజంగా దేశంలో ఒక్క శాతం మంది కూడా స్వచ్చా భారత్ మిషన్ కోసం పూర్తిగా తమ సమయాన్ని కేటాయించడం లేదు. అసలు అ మిషన్ ఉద్దేశ్యాలు ఏమిటో కూడా తెలియని దేశ ప్రజలు వున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఈ విషయాన్ని అలా వుంచితే ఏకంగా మొన్న కేంద్రమంత్రి మార్గమథ్యంలో తన కాన్వాయ్ ను అపి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేయగా, తాజాగా మహారాష్ట్ర నీటి పరిరక్షణ మంత్రి రామ్ షిండే అదే తరహా వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డు పక్కన మంత్రి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న ఆయనకు చెందినదిగా అభియోగిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సాక్ష్యాత్తు మంత్రివర్యులే ఇలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోలాపూర్-బార్షీ మార్గంలో ప్రయాణిస్తున్న మంత్రి రామ్ షిండే.. మార్గమధ్యంలో వాహనంలోంచి దిగి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. తాను అనారోగ్యంగా ఉన్నానని... ‘జల్ యుక్తా శివార్’ పథకం కోసం నెలరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీరిక లేకుండా తిరుగుతున్నాననని.. వరుస ప్రయాణాలతో తాను అనారోగ్యానికి గురయ్యానని చెప్పారు. అయితే బార్షీ వెళ్లే మార్గంలో తనకు ఎక్కడా టాయ్ లెట్ కనిపించలేదని.. దీంతోనే తాను రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందన్నారు.
అయితే రామ్ షిండేపై విపక్ష ఎన్సీపీ మండిపడింది. జాతీయ రహదారిపై ఓ మంత్రే టాయిలెట్ లేదని చెబుతుంటే.. ఇక నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ పథకం ఏ విధంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ‘ఈ ఘటనతో స్వచ్ఛభారత్ విఫలమైందని తెలుస్తోంది. స్వచ్ఛభారత్ సెస్ పేరుతో ప్రజలను కేంద్రం దోచుకుంటోంది’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు. రాష్ట్ర విపక్ష నేతలు ఈ ఘటనను ఆయుధంగా మలచుకొని మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more