AP government shocks shilpa mohan reddy శిల్పా మోహన్ రె్డ్డికి ఏపీ సర్కార్ షాక్..!

Ap government shocks shilpa mohan reddy

andhra pradesh government, shilpa mohan reddy, ysrcp leader, gunmens, security for shilpa, shilpa chakrapani reddy, bhuma akhila priya, chandrababu, chinna rajappa, politics

andhra pradesh government removes security to ysrcp leader shilpa mohan reddy, who just skipped into tdp before nansyal by elections

శిల్పా మోహన్ రె్డ్డికి ఏపీ సర్కార్ షాక్..!

Posted: 11/18/2017 06:19 PM IST
Ap government shocks shilpa mohan reddy

వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి టీడీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మోహన్ రెడ్డి గన్ మెన్లను తొలగించింది. శిల్పాతో పాటుగా నంద్యాల మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన గన్ మెన్లను తొలగిస్తూ ఇవాళ అదేశాలు తీసుకుని తక్షణం వాటిని అమలుపర్చారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గన్‌మెన్ల తొలగింపుపై వైసీపీ అధినేత జగన్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.

జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న తరుణంలో శిల్పా మోహన్‌రెడ్డి గన్‌మెన్లను తొలగించడంపై జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది.  2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి మోహన్‌రెడ్డి టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచారు. భూమా మరణం తర్వాత నంద్యాల నియోజక వర్గానికి ఉప ఎన్నిక వచ్చింది.

వైసీపీ నంద్యాల అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి ఖరారు కావడంతో ఆయన వైసీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్న బాటలోనే నడిచి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన చక్రపాణిరెడ్డి ఈ పార్టీ ద్వారా తనకు లభించిన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles