అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటి..? అంటూ మళ్లీ అదే పాతధోరణిలో ప్రశ్నలు సంధిస్తున్నారు రాజకీయ నాయకులు. అమ్మాయిలు మాత్రమే వున్న కుటుంబంలో తంత్రి మంచానికే పరిమితం అయితే ఆ ఇంట్లో పూట గడవాలంటే ఎవరు పనిచేయాలి..? రాత్రి ఉద్యోగాల నుంచి తిరిగి వచ్చే సమయంలో అమెకు వెంట ఎవరు రావాలి..? ఈ ప్రశ్నలకు నేతలే సమాధానం చెబితే మంచిది. మొన్న బీజేపికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అంతకుముందు మరో రాష్ట్ర బీజేపి మంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేసి ప్రజల నుంచి వమర్శలు ఎదుర్కొన్న తరువాత ఇప్పుడావంతు కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి కి వచ్చింది.
పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంతో ప్రభుత్వాలు విఫలవుతుండటంతో చేసిది లేక.. మగపైశాచిక మృగాలను అదుపు చేయలేక అసలు అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశంలోనే శరవేగంగా ఐటీ రంగంలో దూసుకెళ్లూ సైబర్ నగరంగా గుర్తింపు తెచ్చుకుంటున్న బెంగళూరులో మంత్రి మరో అడుగు ముందుకేసీ అమ్మయాలపై అంక్షలు విధించారు. శాసనమండలిలో 'మహిళా భద్రత'పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పని ఉండదు కనుక, ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని అన్నారు.
ఇక రాత్రివేళ ఆఫీసుకు వెళుతున్న మహిళలకు తోడుగా బంధువులను, లేదా కుటుంబసభ్యులను తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చేశారు. మరి బంధువులకు, కుటుంబసభ్యులకు దూరంగా ఎక్కడి నుంచో వలసవచ్చిన యువతులకు ఎవరు తోడుగా వెళ్లాలన్న ప్రశ్నలు మంత్రికి వ్యతరికంగా ఉత్పన్నమవుతున్నాయి. బెంగళూరులో వున్న కోటి ఇరవై లక్షల మందికి.. వేల సంఖ్యలో వున్న పోలీసులు ఎలా భద్రత కల్పించగలరని కూడా ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. చేతకానప్పుడు బాధ్యతల్లో కొనసాగడం ఎందుకని పలువురు మహిళా సంఘాల నేతలతో పాటు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more