అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. గత అర్థారత్రి జరిగిన కాల్పుల కలకలం పలు చోట్ల వినిపించినా.. ఓ స్థానిక పాఠశాలలోకి వెళ్లేందుకు కూడా దుండగలు యత్నించారన్న వార్తతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా భీతిల్లిపోయారు. భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ప్రాంతంలో పలు చోట్ల సాయుధుడైన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
చివరకు స్థానికంగా వున్న ఎలిమెంటరీ స్కూల్ లోకి ప్రవేశించేందుకు తీవ్రంగా యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకున్న నలుగురు పాఠశా సిబ్బందిని హతమార్చిన అగంతకుడు.. సుమారు పది మందిని గాయపర్చాడు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా వున్నట్లు సమాచారం. అమెరికాలోని రాంచో టెహామా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కాలిఫోర్నియాలోని రెడ్ బ్లఫ్ గ్రామీణ ప్రాంతంలోని రాంచో టెహామా ప్రాంతంలో ఓ సాయుధుడైన అగంతకుడు కాల్పులతో చెలరేగిపోయాడని సమాచారం అందుకున్నామన్నారు.
అయితే పలు చోట్ల తన చేతిలోని సెమీ ఆటోమెటిక్ గన్, రెండు హ్యాండ్ గన్ కాల్పులు జరిపిన అగంతకుడు..చివరకు ఏకంగా స్థానికంగా వున్న ఎలిమెంటరీ పాఠశాలలో చొరబడేందుకు కూడా యత్నించాడు. అగంతకుడిని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపై కాల్పులతో విరుచుకుపడి నలుగురిని హతమార్చాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి అగంతకుడ్ని కాల్చిచంపారు. సాయుధుడ్ని కెవిన్ గా గుర్తించిన పోలీసులు కాల్పలకు తెగబడేందుకు మాత్రం కారణాలు తెలియరాలేదని చెప్పారు.
పాఠశాలలోకి చోరడేందుకు యత్నించగా అడ్డుకున్న క్రమంలో దుండగుడు జరిపిన కాల్పల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తూటాగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్సను అందిస్తున్నారు. అయిేత వీరిలో ఇద్దరు విద్యార్థులు కూడా వున్నారని సమాచారం. కాగా కాల్పులు జరిపిన కెవిన్ వృద్ధుడని, అతను ఎందుకు కాల్పులు జరిపాడో తెలుసుకోవాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more