traffic police to plan fine on all the three in triple riding యువత తెలుసుకో: ట్రిపుల్ రైడింగ్ పై నిబంధనలు కఠినం

Traffic police to plan fine on all the three in triple riding

two wheelers, bikes, triple riding, traffic police, traffic rules, youth, road accidents, hyderabad, cyberabad, rachakonda commissionerates, telangana government

telangana traffic police has prepared a report on road accidents, mainly the two wheeler accidents where the youth repeatedly held in triple riding.

యువత తెలుసుకో: ట్రిపుల్ రైడింగ్ పై నిబంధనలు కఠినం

Posted: 11/13/2017 11:55 AM IST
Traffic police to plan fine on all the three in triple riding

హైదరాబాద్ మహానగరంలో జరగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్నందువల్లే యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుసుకున్న పోలీసు యంత్రాంగం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూవీలర్స్ పై ట్రిపుల్ రైడింగ్ చేసే యువతను కట్టడి చేయాలని భావిస్తుంది. ఇకపై ద్విచక్రవాహనాలపై ట్రిఫుల్ రైడింగ్ చేసే ముగ్గరికి జరిమానా వేయాలని యోచిస్తుంది.

సాధారణంగా ఇప్పటివరకు కేవలం వాహనం నడిపే వ్యక్తిపై మాత్రమే కేసులు వేసి జరిమానా కట్టించుకునేవారు. అయితే ఈ నిబంధనను కాసింత కఠినతరం చేయాలని ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. దీంతో ప్రమాదాలకు అడ్డకట్ట వేయవచ్చని వారు భావిస్తున్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న ఇద్దరిపైనా కేసులు నమోదు చేయాలని.. ముగ్గురిపైనా జరిమానా విధించాలని అధికారులు యోచిస్తున్నారని సమాచారం.
 
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ట్రిపుల్‌ రైడింగ్‌ కేసుల వివరాలతో ఒక నివేదికను రూపొందించి ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు.. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌ వల్ల కలిగే అనర్థాలు, పరిణామాల గురించి సమగ్రంగా ఆ నివేదికలో పేర్కొననున్నారు. తమ నివేదికలో నగరశివార్ల పరిధిలోనే యువత అధికంగా ట్రిఫుల్ రైడింగ్ చేస్తుందని కూడా గుర్తంచారు.

రాచకోండ కమీషనరేట్ పరిధిలో కేవలం 5 నెలల్లోనే 10 వేల ట్రిపుల్‌ రైడింగ్‌ కేసులు నమోదు చేసి.. రూ. 10లక్షల మేర జరిమానాలు విధించారంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు. దీంతోనే చట్టాన్ని కఠినతరం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నారి అధికారులు. ఇకపై ట్రిపుల్ రైడింగ్ కేసులో వాహనచోదకుడితో పాటుపాటు వెనుక కూర్చున్న ఇద్దరిపైనా కేసులు నమోదు చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles