కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద ఆదివారం సాయంత్రం ఫెర్రీ ఘాట్ వద్ద బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఏడుగురు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. నేడు మరో రెండు మృతదేహాలు లభ్యం కావటంతో ఆ సంఖ్య 18కి చేరింది. మృతుల్లో 15 మంది ఒంగోలు వాకర్స్ క్లబ్ మెంబర్స్ కాగా, ఒక వ్యక్తి నెల్లూరుకు చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు నిన్న సాయంత్రం నుంచి గాలింపు చేపట్టాయి. కాగా, బోటు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ దారుణం చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు.
ఘటనపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు. కాగా, బోటు యజమాని, సహాయకులు పరారీలో ఉన్నారని వారు తెలిపారు. కాగా, మృతహాలు నేటి ఉదయం ఒంగోలుకు చేరుకోగా.. బంధువుల రోదనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల వివరాలు...
1) రాయపాటి సుబ్రహ్మణ్యం (60)
2) పసుపులేటి సీతారామయ్య (64)
3) కె.ఆంజనేయులు (58)
4) కోవూరి లలిత (35)
5) వెంకటేశ్వరరావు (48)
6) రాజేశ్ (49)
7) హేమలత (49)
8) దాచర్ల భారతి (60)
9) కోటిరెడ్డి (45)
10) ప్రభాకర్రెడ్డి (50)
11) అంజమ్మ (55)
12) వెన్నెల సుజాత (40)
13) గుర్నాధరావు
14) కోవూరి వెంకటేశ్వరరావు(40)
15) సాయిన కోటేశ్వరరావు
16) సాయిన వెంకాయమ్మ తదితరులుగా వాకర్స్ క్లబ్ మెంబర్లు తేల్చారు.
కాగా, గల్లంతైన వారి వివరాలు...
1) వెన్నెల రమణమ్మ
2) కారుదారు ఉషారాణి
3) గాజర్ల శివన్నారాయణ
4) పోల కోటేశ్వరరావు
5) పోల వెంకాయమ్మ
6) బిందుశ్రీ
7) కూరపాటి నారాయణరాజు... ఉన్నట్టు వారు తెలిపారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు, స్థానిక మత్స్యకారులు కూడా గాలింపు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టేది లేదని చినరాజప్ప ఈ సందర్భంగా హెచ్చరించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశామని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు, అదనపు బలగాలను కూడా పంపామని అన్నారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అన్ని విధాలుగానూ ఆదుకుంటామని, తక్షణం ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. మృతిచెందిన వారిలో చంద్రన్న బీమా ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, బీమా లేని వారికి 8 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాగా అందజేయనున్నామని ఆయన తెలిపారు.
Capsizing of a boat in the Krishna River is anguishing. My thoughts are with the families of those who lost their lives in this tragedy. Andhra Pradesh Government and @NDRFHQ have been working on rescue operations: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more