భారతీయ జ్యోతిష్యం అంటే దేశవిదేశాలలోని ప్రజలకు మంచి గురి. ఇక్కడి జ్యోతిష్యులు చెప్పిన జోస్యంలో నూటికి తొంబై తొమ్మిది శాతం పక్కాగా జరుగుతుందని వారు విశ్వసిస్తారు. అందులో కేరళా జ్యోతిష్యం పేరు చెబితే.. ఇక తిరుగుండదన్న నమ్మకం. ఇలాంటి నమ్మకమే పాకిస్థాన్ వాసులకు ఏర్పడింది. మరీ ముఖ్యంగా చెప్పాంటే అక్కడి ప్రభుత్వాన్ని కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మన దేశ ప్రధానికి ఇదే జ్యోతిష్యుడు ఏకంగా లేఖ రాసినా.. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ లక్ష్యపెట్టకపోగా,దానిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని సమాచారం.
అయితే ఈ జ్యోతిష్యుడు రాసిన లేఖ వెలుగులోకి రావడంతో.. పాకిస్తాన్ మాత్రం శరవేగంగా చర్యలు చేపట్టింది. కేరళకు చెందిన బాబూ కాలాయిల్ అనే జ్యోతిష్యుడు ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటికల్లా హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవిస్తుందని సెప్టెంబర్ 20న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇంకా ఆ లేఖలో ఈ భూకంపం ధాటికి భారత్, పాకిస్థాన్, చైనా సహా మొత్తం 11 దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు.
అయితే ప్రధానమంత్రి కార్యాలయం కేరళ నుంచి వచ్చిన లేఖను చాలా లైట్ గా తీసుకుంది. అయితే ఈ లేఖ సారంశం వెలుగులోకి రాగానే పాకిస్థాన్ మాత్రం సీరియస్ గా తీసుకుంది. భూకంపం కారణంగా సునామీ లాంటివి సంభవిస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తోంది. దీంతో ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పాక్ పీఎంవో ఆధ్వర్యంలో పనిచేసే ‘భూకంపాలు, పునరావాసం, పునర్నిర్మాణ ప్రాధికార సంస్థ’(ఎర్రా) వివిధ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో బాబూ కాలాయిల్ పీఎంవోకి రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more