నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నూతన డిజైన్లు వెలుగులోకి వచ్చాయి. లండన్ లో ఈ మేరకు నార్మన్ పోస్టర్ బృందంతో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డిజైన్లను పరిశీలించారు. రెండేసి డిజైన్లను చూపించగా.. వీటిలోనే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి యనమల, దర్శకుడు రాజమౌళి కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
లండన్ బృందం వివరణ...
భారతీయత ఉట్టిపడేలా, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా నవ్యాంధ్ర శాసనసభ, హైకోర్టు భవనాల ఆకారాలను తయారు చేస్తున్నట్లు నార్మన్ పోస్టర్స్ ప్రతినిధి క్రిస్ బాబ్ తెలిపారు. ఒక్కో భవంతికి రెండు ఆకారాలు.. నమూనా ఆకృతులను, ఆపై వీడియో చిత్రాలను వీరు తిలకించారు. ఈ భవంతుల ప్రత్యేకతలను వివరిస్తూ, నాలుగు కిలోమీటర్ల వరకూ ఇవి కనిపిస్తాయని క్రిస్ వెల్లడించారు. వాటి విషయంలో ముఖ్యమంత్రి కాస్త అసంతృప్తి వ్యక్తం చేయటంతో బుధవారం మరోసారి నిపుణులతో ఆయన సమావేశం అవుతున్నట్లు ప్రకటించారు. అయితే అలాంటిదేం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జక్కన్న సలహాలు...
లండన్ వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి నవ్యాంధ్ర రాజధాని అమరావతి శాశ్వత భవనాల డిజైన్లను పరిశీలించిన దర్శక దిగ్గజం రాజమౌళి పలు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజధాని తెలుగువారి ఘనమైన వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కట్టడాలు ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజల మనసులకూ దగ్గరగా ఉండేలా డిజైన్లు ఉండాలని, వారు తమ ప్రాంత వైశిష్ట్యాన్ని ఈ డిజైన్లలో చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం.
- శాతకర్ణి వినియోగించిన జెండాలవంటివి అసెంబ్లీకి అన్ని వైపులా ఏర్పాటు చేసి, ప్రజలు వాటిని చూస్తూ తిరిగి వెళ్లేందుకు వీలుగా ఖాళీ స్థలాన్ని వదలాలని సూచించారు.
- చారిత్రకాంశాలను బొమ్మల రూపంలో నిలపాలని, వాటిని ఫొటో తీయగానే వివరాలు వచ్చేలా యాప్స్ తయారు చేయాలి.
- అమరావతి నిర్మాణానికి తెచ్చిన మట్టి, నీరు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రతి ఒక్కరికీ చెప్పేలా యాప్ ఉండాలని అప్పుడే ప్రతి ప్రాంతం వారూ రాజధానిలో తామూ భాగస్వామ్యమైనామని భావిస్తారని చెప్పారు.
- అసెంబ్లీ భవనం ముందు కొలను ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకాంతి నీటిపై పడి, ప్రతిబింబించి భవంతిపై పడేలా చూడాలని కోరారు. అది చూపరులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని, పున్నమి వేళ అదే మహాద్భుతమవుతుందని చెప్పగా.. నార్మన్ పోస్టర్స్ బృందం ఏకీభవించిందని సమాచారం.
- దూరం నుంచి చూస్తే ఒకేలా అసెంబ్లీ, హైకోర్టులు కనిపించాలని.. దగ్గరికి వచ్చే కొద్దీ వాటి రూపురేఖలు మారుతూ వేటికవి ప్రత్యేకంగా కనిపించేలా 'ఇంపోజింగ్ బిల్డింగ్' విధానంలో వీటిని కట్టాలని రాజమౌళి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
అమరావతి కొత్త డిజైన్లు ఇవే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more