కాదేఫోన్ పేలుడుకు అనర్హం.. అంటూ నేటి స్మార్ట్ ఫోన్ అభిమానులు కోత్త కవిత్యాలు రాస్తున్న క్రమంలో.. అదే తరహాలో కాదే ఫీచర్డ్ ఫోన్ పేలుడుకు అనర్హం అంటూ రాసేస్తున్నారు.. ఇప్పటి ఫీచర్డ్ ఫోన్ ప్రియులు. ఇందగలదు.. అందుగలదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా పెలుడు సంభవించు అన్నట్లుంది వయ్యారం అని అశ్చర్యపోక తప్పదు. అయితే అన్నింటికీ మించి ముందుగా పేలుతున్నవన్నీ చైనా ఫోన్లే అని కోట్టిపారేసినా.. ఆ తరవాత మాత్రం శాంసంగ్ ఫోన్లు కూడా పేలుడం ప్రారంభించాయి. నాణ్యతలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఐపోన్ కూడా పేలుతుండటంతో విస్మయానికి గురయ్యారు స్మార్ట్ ఫోన్ ప్రియులు.
ఇక తాజాగా ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో ఫోన్ కూడా పేలిందన్న వార్త హల్ చల్ చేస్తోంది. కాశ్మీర్ లో ఓ వ్యక్తి ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన జియో ఫోన్ పేలిందని రాడార్ అనే టెక్నాలజీ బ్లాగ్ దీన్ని ప్రచురించింది. ఫోన్ బ్యాక్ ప్యానల్ మొత్తం దెబ్బతిన్న ఫొటో కూడా పోస్ట్ చేసింది. రాడార్ అందించిన నివేదిక ప్రకారం చార్జింగ్ లో ఉండగా జియో ఫీచర్ పోన్ పేలింది. హ్యాండ్సెట్ వెనక భాగం పూర్తిగా కాలిపోయింది. కరిగిపోయినట్టు రిపోర్ట్ చేసింది. జియో ఫోన్ పేలింది అన్న సమాచారం ఒక్కసారిగా కలకలం రేపింది. రాడార్ కథనాన్ని కోట్ చేస్తూ.. జాతీయ వెబ్ పోర్టల్స్ సైతం జియో ఫోన్ పేలుడుని ప్రముఖంగా హైలెట్ చేశాయి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జియో ఫోన్ పేలుడుకి సంబంధించి నిజమా కాదా అనే విషయంపై కంపెనీ కూడా రంగంలోకి దిగింది. ఈ వార్తపై వివరణ ఇచ్చింది. ఈ సమాచారం మా దృష్టికి కూడా వచ్చిందని స్పష్టం చేసింది జియో. ఇది కొందరు కావాలని సృష్టించారని.. ఎవరూ నమ్మొద్దని చెప్పింది. ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలలేదని తెలిపింది. దీని వెనక ఏదో జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. జియో ఫీచర్ ఫోన్ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు అయ్యిందని వివరణ ఇచ్చింది. అన్నీ పరిశీలించిన తర్వాతే బయటకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై మరింత విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. జియో వివరణ తర్వాత రాడార్ వెబ్ బ్లాగ్ నుంచి జియో పేలుడు వార్తను తొలగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more