తమిళనాడులోని హోరం జరిగింది. అప్పును తీసుకున్న పాపానికి ఆ కుటుంబంలోని చిన్నారులతో పాటు అందరూ అగ్నికి అహుతికావాల్సి వచ్చింది. తీసుకన్న రుణం వడ్డీతో సహా కలిపి తిరిగి చెల్లించినా.. ఇంకా వడ్డీ కిందే ఇచ్చిన మొత్తం పోయిందని, అసలు అలాగే వుందని అప్పు తీసుకన్న కుటుంబాన్ని జలగల్లా వేధిస్తుండటంతో.. కలెక్టరేట్ కు చేరుకున్న బాధితుడి కుటుంబం.. అక్కడ కూడా తనకు సరైన విధంగా న్యాయం జరగడం లేదని అవేదనతో తన భార్య, కూతుళ్లుపై కిరోసిన్ పోసి నిప్పించించి.. తాను నిప్పంటించుకున్నాడు.
ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి కలెక్టర్ ఆఫీసు వద్ద చోటు చేసుకుంది. తమ సమస్య గురించి కలెక్టర్కు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినిపించుకోకుండా వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపుతున్నారని, దీంతో ఎస్పీ కార్యాలయంలో వారు సంబంధిత పోలిస్ స్టేషన్ కు పంపుతున్నారని, అక్కడి పోలీసులు అప్పులిచ్చే వారితో చేతులు కలపడంతో తమకు న్యాయం జరగడం లేదని అంగలార్చిన ఓ కుటుంబం విపరీతమైన నిర్ణయానికి వచ్చి అత్మహత్యయత్నానికి పాల్పడింది.
బాధిత కుటుంబంలోని భార్య సుబ్బులక్ష్మీ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తమ సోదరి కుటుంబానికి డబ్బు అవసరమై ఎనమితి నెలల క్రితం లక్షన్నర రూపాయలను ముత్తులక్ష్మి అనే వ్యక్తి నుంచి అప్పు తీసుకుందని, అయితే వారికి వడ్డీతో సహా డబ్బును సుమారు రూ, 2.35 వేలను చెల్లించినా ఇంకా తమకు డబ్బురావాలని ప్రతినిత్యం పీడిస్తున్నారని, దీంతో స్థానిక పోలిస్ స్టేషన్ వెళ్లినా తమకు న్యాయం జరగలేదని అన్నాడు.
దీంతో.. వారు కలెక్టర్ కార్యాలయాని వచ్చినా ఎప్పటి మాదిరిగానే ఎస్సీ కార్యాలయానికి పంపడంతో.. విసిగిపోయిన అత్మహత్యయత్నానికి పాల్పడ్డారని చెప్పాడు. స్థానికులు, పోలీసులు కాపాడారు. వెంటనే మంటలను ఆర్పేసి ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేసిన వారు ఇసక్కిముత్తు, ఆయన భార్య సుబ్బలక్ష్మి, వారి కూతుళ్లు మదు శరణ్య, అక్షయ పూర్ణిమగా పోలీసులు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more