ఇంటి దొంగలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహర్నిషలు కష్టపడి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఎందరో కష్టపడ్డారని, అలాంటిది.. ఇంటి దొంగలు తమ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ అధిత్యనాథ్. తమ పార్టీకి చెందిన మహిళా మోర్చా నాయకురాలిని అరెస్టు చేయించి కటకటాల వెనక్కి పంపారు.
ఇంతకీ అమె చేసిన నేరమేంటో తెలుసా..? ఓ దోంగతనం కేసులో నిందితుడైన యువకుడ్ని బయటకు తీసుకురావడం కోసం సదరు వ్యక్తి తల్లి నుంచి ఏకంగా యాభై వేల రూపాయలు తీసుకుంది. యాబై వేల రూపాయలను ఇస్తే జైలుకు వెళ్లకుండా తన కొడుకును కాపాడతానని చెప్పిన బీజేపి నాయకులు.. డబ్బు తీసుకుని ముఖం చాటేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన నిందితుడి తల్లి ఏకంగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పడంతో అమెను అరెస్టు చేయించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఈ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. గోరఖ్ పూర్ లోని అవాస్ వికాస్ కాలనీకి చెందిన హర్షిత్ పాండే అనే యువకుడు సెల్ ఫోన్ చోరీ కేసులో నిందితుడిగా వున్నాడు. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని తల్లి రీటా పాండేకు సమాచారం అందించారు. దీంతో ఆమె తనకు తెలిసిన వారితో కలిసి మాగానగర్ కు చెందిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సరితా సింగ్ ను ఆశ్రయించారు.
తన కుమారుడ్ని ఎలాగైనా కాపాడాలని, జైలుకు వెళ్లకుండా చూడాలని వేడుకున్నారు. దీంతో ఆమె యాభై వేల రూపాయలు ఇస్తే హర్షిత్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుతానని చెప్పారు. దీంతో ఆమె అడిగినట్టే డబ్బులు తెచ్చి ఇచ్చారు. అయితే పోలీసులు హర్షిత్ పాండేను జైలుకి పంపారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న రీటా పాండే పోరిగింటివారికి విషయాన్ని చెప్పగా ప్రతిభా పాండే అనే మహిళ బాధితురాలని నేరుగా సీఎం యోగిఆదిత్యనాథ్ వద్దకు తీసుకెళ్లారు.
ఆ సమయంలో యోగి అధిత్యనాథ్ గోరఖ్ పూర్ లోనే వున్నారు. మహిళ తాను రెండు విధాలుగా బాధపడుతున్నానని, బీజేపి నేత సరితా పాండే నమ్మకద్రోహం చేసిందని అరోపించారు. దీంతో అక్కడే వున్న గోరఖ్ పూర్ ఎస్ఎస్పీ అనిరుద్దా పాండేను ఘటనపై నిలదీపి.., తక్షణం చర్యలు తీసుకోవాలని అదేశించారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదుతో బీజేపి మహిళా మోర్చా నేతను పోలీసులు అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more