దేశంలో గతమెన్నడూ లేని కొత్త నోటును అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం.. దానిని దేశ ప్రజలందరి చేతికి అందించడంలో మాత్రం విఫలమైంది. దీంతో ఈ నోటును దేశ ప్రజలందరి చేతుల్లోకి వెళ్లేందుకు వీలుగా మరో ప్రత్యామ్నాయం చేసింది. రూ.100 నోటుకు ఐదువందల నోటుకు మధ్య చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు వచ్చిన రూ.200 నోటును ఇప్పటికీ దేశంలోని దాదాపుగా 90 శాతం మంది కనీసం దర్శనానికి కూడా నోచుకోలేందంటే అతిశయోక్తి కాదు. దీంతో ఈ నోటును అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది భారతీయ రిజర్వు బ్యాంకు.
దీంతో ఇక త్వందర్లోనే రూ. 200 నోటు కూడా ఏటీయం కేంద్రాలలో దర్శనమివ్వనుంది. తద్వారా ఈ నోటును దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ప్రస్తుతానికి కేవలం బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న ఈ నోటు ఇక మరో రెండు నెల్లల్లో ఏటీఎంలలోకి రానుంది. అంటే రమారమి నూతన సంవత్సరానికి ఈ నోటును దేశవ్యాప్తంగా అన్ని ఏటీయం కేంద్రాలలో అందుబాటులో వుంచేందుకు అర్బీఐ సన్నహాలు చేస్తుంది. నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేసిన బ్యాంకులు మళ్లీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వాటిని రీకాలిబ్రేట్ చేయడానికి మరికొంత కాలం పట్టే అవకాశముందని ఎన్సీఆర్ ఎండీ నవ్రోజ్ డస్టర్ చెప్పారు. ఎన్సీఆర్ దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఏటీఎంలను నిర్వహిస్తుంది
ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడం సులువైన పని అని ప్రజలు భావిస్తున్నారని, కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది అని కెనరా బ్యాంక్ ఛైర్మన్ రాకేశ్ శర్మ అన్నారు. రీకాలిబ్రేషన్ కు చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియని, దీనికోసం వారాల తరబడి సమయం పడుతుందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు సమయంలో రాత్రింబవళ్లు కష్టపడ్డామని, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రెండు వారాల్లో మార్చామని తెలిపారు. ప్రస్తుతం అంత తొందరపాటు ఏమీ లేదన్నారు. కొంత సమయం తీసుకుని ఏటీఎంలను రీకాలిబ్రేషన్ చేపడతామని రాకేశ్ శర్మ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more