జియో మరో సంచలన ఆఫర్తో ముందుకొచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం తీసుకువచ్చిన ఆపర్ ను మళ్లీ ఈ దీపావళి పండుగను పురష్కరించుకుని ‘దివాళి ధన్ ధనా ధన్’ ఆఫర్ తన కస్టమర్లకు ప్రకటించింది. దీనిలో భాగంగా జియో వినియోగదారులు ఈనెల 12 నుంచి 18 వరకు రూ. 399తో రిచార్జ్ చేసుకుంటే 100% క్యాష్ బ్యాక్ను పొందవచ్చని తెలిపింది. రిచార్జ్ చేసుకున్న వెంటనే వారికి రూ. 50 విలువ గల ఎనిమిది ఓచర్లు క్రెడిట్ అవుతాయని, వాటిని భవిష్యత్లో రిచార్జ్ చేసుకునే సమయంలో వాడుకుని మొత్తం రూ. 400 క్యాష్ బ్యాక్ పొందవచ్చని వివరించింది.
ఈ వోచర్లను రూ.309 ఆపై విలువ గల ప్లాన్లు, రూ. 91 ఆపైన విలువ గల డాటా ప్లాన్లకు మాత్రమే వినియోగించాలన్న నిబంధన కూడా వుంది. ఒక రిచార్జ్కు ఒక ఓచర్నే ఉపయోగించాలి. అయితే నవంబర్ 15 తర్వాత మాత్రమే ఈ ఓచర్లను వినియోగించాలని సంస్థ కండీషన్ పెట్టింది. వీటిని ఎలా ఉపయోగించాలంటే.. రూ. 399 రిచార్జ్ చేసుకునే సమయంలో ఒక ఓచర్ వినియోగించుకుంటే రూ. 349 చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ప్లాన్ వ్యాలిడిటీ అయిపోకపోయినా ఈ రిచార్జ్ చేసుకుంటే.. యాక్టివేట్ అవుతుంది.
ఇలా జియో అఫర్ ప్రకటించగానే అటు టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్ టెల్ కూడా కొత్త ప్రకటనతో జియోకు కౌంటర్ ఇస్తోంది. నిన్ననే తొలిసారి 4జీ యూజర్ల కోసం రూ.1,399తో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన ఎయిర్ టెల్, తాజాగా మరో కొత్త ప్లాన్ ను ప్రకటించింది. తన పోస్టుపెయిడ్ యూజర్ల కోసం కొత్త మైప్లాన్ ఇన్ ఫినిటీ పోస్టు పెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 50జీబీ డేటా, అపరిమిత కాల్స్ ను ఎయిర్టెల్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. వినియోగించని డేటాను వచ్చే బిల్లింగ్ సైకిల్కు పంపించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more