డేరా సచ్చా సౌదా ముసుగులో భక్తి పారవశ్యానికి బదులు అక్కడ జరిగిందంతా అడపడచులపై అత్యాచారమే. బెదిరింపు, భయాందోళనకు గురిచేసి.. బాబా ముసుగు కప్పుకుని యధేశ్చగా సాగాని నేరసామ్రాజ్యమే డేరా సచ్చా సౌదా. నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, అన్యాయాలు.. పగిలిన పడతులు చేతి గాజాలు.. ధిక్కిరించిన వారి కళేభరాలు.. బలవంతంగా వ్యభిచారాలు ఇలా ఒక్కటి కాదు అనేకానేక హింసతో సాగిన సామ్రాజ్యం ఇద్దరు సాధ్వీల మొక్కవోని ధైర్యం నేలకూల్చింది. గుర్మిత్ రామ్ రహీం సింగ్ బాబా అట కట్టించింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించేలా చేసింది.
ఎంతటి బలమైన అన్యాయమనా.. బలీయమైన న్యాయం ఎదుట లోంగిపోకతప్పదన్నది.. దర్మమే జయిస్తుందన్నది ఈ ఘటనల్లో నిరూపితమైంది. అయితే గుర్మిత్ నేరాల్లో తన వంతుగా పాలుపంచుకున్న అయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇసాన్ బాబా జైలు జీవితం ప్రారంభించిన నాటి నుంచి తప్పించుకుని తిరుగుతుంది. అమె విదేశాలకు వెళ్లారని, నేపాల్ బార్డర్ నుంచి తప్పించుకున్నారని అనేక కథనాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడ ముమ్మరంగా తనిఖీలు చేసి.. చిట్టచివరకు గుర్మిత్ సింగ్ వద్దకే వచ్చి అచూకీ గురించి అరా తీశారు.
అయితే హనీప్రీత్ లేదన్న వార్తలు నిజం కాదని అమె తరపు న్యాయవాది ప్రదీప్ అర్య అన్నారు. అమె ఢిల్లీలోనే వున్నారని.. అమె పంచకుల న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారెంట్ నుంచి మినహాయింపు కోరుతూ ముందస్తు బెయిల్ పిటీషన్ తీసుకోనేందుకు ఢిల్లీ హైకోర్టును అశ్రయించారని అయన చెప్పారు. గుర్మిత్ రామ్ రహీం సింగ్ బాబా సాగించిన నేరసామ్రాజ్యలలో తనకేమాత్రం పాత్ర లేదని, తాను కేవలం అయన పుత్రికను మాత్రమేనని అమె యాంటిసిపేటరీ బెయిల్ పిటీషన్ లో పోందుపర్చానని అర్య చెప్పారు. హనీప్రీత్ ముందస్తు బెయిల్ పై మధ్యామ్నం న్యాయస్థానం విచారించనునందని సమాచారం.
అయితే హనీప్రీత్ ఇసాన్ ఢిల్లీ రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం అశ్రయించారన్న సమాచారం అందుకున్న హర్యానా పోలీసులు అమె కోసం ఐదు బృందాలుగా విడిపోయి మరీ అన్వేషిస్తున్నారు. విదేశాలకు వెళ్లిందన్న వార్తల నేపథ్యంలో అమె ఇంకా దేశంలోనే అందులోనూ దేశ రాజధానిలోనే వుందన్న వార్త తెలిసి విస్మయానికి గురైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అమెను ఎలాగైనా అరెస్టు చేసి పంచకుల కోర్టులో నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసుల ప్రయత్నాలు ఫలించేనా.? అన్నది వేచి చూడాల్సిందే.
నాకు ప్రాణ భయం ఉంది : హనీప్రీత్
తనకు ప్రాణభయం ఉందని, ఎక్కడ, ఎవరు చంపేస్తారోనన్న ఆందోళనలో ఉన్నానని హనీప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హర్యానా డ్రగ్స్ మాఫియా నుంచి తనకు ముప్పు ఉందని హనీ అందులో పేర్కొంది. దీనిపై నేటి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కోర్టు విచారణ చేబడుతుంది.
తనకు బెయిల్ ఇస్తే, ఎక్కడికీ పారిపోబోనని, పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చింది. తాను నేపాల్ కు పారిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఎక్కడ తనను చంపేస్తారోనన్న భయంతో దాగుండి పోయానని చెప్పింది. కాగా, ఈ పిటిషన్ పై విచారణ జరిగే సమయానికి తాము కూడా కోర్టులో ఉండాలని భావిస్తున్న సిట్ అధికారులు సైతం హైకోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గుర్మీత్ శిక్ష అనంతరం చెలరేగిన అల్లర్లతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, బాబాతో తనకు సంబంధాలున్నాయన్న వార్తలపై ఆమె కలత చెందినట్లు హనీప్రీత్ తన లాయర్ తో చెప్పినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more