దేశంలో ప్రతీ ఏడాది ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు పూర్తి చేసుకుని వస్తూనే వుంటారు. ఇంజనీర్ల విషయాన్ని పక్కనబెడితే.. డాక్టర్ గా ఒక విద్యార్థి పట్టాను పొందడానికి అయ్యే ఖర్చుమాత్రం చాలా అవుతుందన్ని విషయం తెలుసా.? అందుకు ప్రజాధనం ఖర్చువుతుందన్న విషయం మాత్రం కూడా తెలియని వారు చాలా మందే వుంటారు. అయితే తామేదో కష్టపడి కోర్సును పూర్తి చేసి వైద్యులుగా ప్రజల్లోకి వెళ్లి క్లినిక్ లు లేదా ప్రాక్టీసులు పెట్టేస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఆ విషయాలను తెలుసుకున్న మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నావిస్ ప్రభుత్తం సంచలనం నిర్ణయం తీసుకుంది. ప్రజాధనంతో వైద్యులుగా తయారవుతున్న వైద్యలు.. ప్రజల కోసం మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజల కోసం వారి సేవలను అందించాలని అదేశాలు జారీ చేసింది. అంతేకాదు గ్రామాల్లో పనిచేయని డాక్టర్లపై వేటు వేస్తామని ప్రకటించింది. గ్రామాల్లోని హెల్త్కేర్ సెంటర్లలో సేవ చేయకపోతే వైద్య వృత్తికి దూరమవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామాల్లో సేవ చేయడాన్ని ఉల్లంఘిస్తే కొత్త నిబంధనల ప్రకారం డాక్టర్లపై కొంతకాలం లేదా శాశ్వతంగా నిషేధం విధించనున్నారు.
ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసర్చ్ నిబంధనలతో కూడిన నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామాల్లో పని చేయని వారు.. మెడికల్ ప్రాక్టీషనర్గా రిజిస్ట్రేషన్ కోల్పోతారు. సదరు వైద్యులను బోగస్ డాక్టర్లుగా పరిగణిస్తాం. వారిపై మహారాష్ట్ర మెడికల్ ప్రొఫెషన్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని.. నోటిఫికేషన్లో తెలిపింది. ప్రభుత్వ ఎంబీబీఎస్ కాలేజీల్లో అడ్మీషన్ తీసుకున్నప్పుడే … వారితో బాండ్ రాయించుకుంటోంది ప్రభుత్వం. దాని ప్రకారం విద్యార్థులు తమ కోర్స్ పూర్తికాగానే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కొందరు విద్యార్థులు బాండ్ను ఉల్లంఘించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more