దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇవాళ అమ్మవారి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే పలు కాలనీల్లో అమ్మవారిని విగ్రహాన్ని స్థాపించి, అవాహనం చేసి.. ప్రత్యేక పూజలతో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఇక అనేక అలాయాల్లో కూడా ఇవాళ వేకువ జామునుంచే అమ్మవారి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల ప్రారంభం కావడంతో ఇవాళ అమ్మవారిని దర్శించుకనేందుకు భక్తులు ఉదయమే అలయాలకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఇక దేశవ్యాప్తంగా అన్ని అమ్మవారి శక్తిఫీఠాల్లోనూ దేవీశరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఫుణ్యక్షేత్రాలలో అమ్మవారి శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నాయి అలయకమిటీలు. ఇప్పటికే విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై వెలసినీ కనకదుర్గమ్మ ఆలయానికి తండోపతండాలుగా విచ్చేసిన భక్తులు అమ్మావారి దర్శనం కోసం బారులు తీరారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు దసరా ఉత్సవాలు సాగనున్నాయి.
ఇవాళ శరన్నవరాత్రులు తొలిరోజు కావడం చేత కనకదుర్గమ్మ తల్లి భక్తులకు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు అభయప్రధానం చేయనున్నారు. పూర్తి స్వర్ణాభరణాల కాంతుల మధ్య దుర్గమ్మ ధగధగలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. కుడి చేతిలో స్వర్ణంతో చేసిన త్రిశూలాన్ని పట్టుకున్న అమ్మవారు.. భక్తులకు కొండంత అండగా నిలుస్తానన్నట్లు మూర్తీభవించి వుంటుంది. అమ్మవారి నవరాత్రి వేడుకల ప్రారంభాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని విశ్వసించే భక్తులు.. వేకువ జామునే అలయాన్ని చేరుకున్నారు.
తొలిరోజున అమ్మవారి దర్శనానికి భక్తులను ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తామని, ఈ-సేవ, ఇంటర్నెట్ ద్వారా దర్శన స్లాట్లను పొందిన వారికి త్వరగా దర్శనం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. కృష్ణా ఘాట్ నుంచి భక్తులను పైకి అనుమతిస్తామని, వేరే మార్గంలో కిందకు వెళ్లాల్సి వుంటుందని స్పష్టం చేశారు. కొండపై వన్ వే అమల్లో వుందని, ఎటువంటి వాహనాలనూ అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more