పండుగ సీజన్ వచ్చిదంటే చాలు వినియోగదారులను తమ దుకాణాలకు రప్పించుకునేందుకు అనేక రకాల అఫర్లను, డిస్కోంట్లను ప్రకటించేస్తుంటారు వాణిజ్యవేత్తలు. అయితే ఇదే పండగ సీజన్ అదనుగా పెట్టుకున్న కొన్ని ప్రభుత్వ శాఖలు మాత్రం ప్రయాణికుల జేబులను గుల్ల చేసేందుకు రెడీ అవుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ కొత్త తరహా విధానం అమలు అవుతుంది. పండగ సీజన్ లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని అర్టీసీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో రైల్వే శాఖ ప్రయాణ చార్జీలను పెంచేసి లాభాలను గడించేస్తుంటాయి.
అది చాలదన్నట్లు ప్రయాణికులతో పాటు ప్రయాణికులను రైళ్లలో ఎక్కించేందుకు వచ్చే వచ్చే బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా అదాయాన్ని రాబట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ సన్నధమైంది. ఈ మేరకు ఏకంగా ఫ్లాట్ ఫాం టిక్కెట్ చార్జీలను రెండింతలు చేసింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ చార్జీలు అక్టోబర్ 3 వరకు అమల్లో వుండనున్నాయని సమాచారం. ప్రసత్తం వున్న ఫ్లాట్ ఫాం ధరలను ఏకంగా నూటికి నూరు శాతం పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రైల్వేశాఖ అధికారుల నిర్ణయం ఇటు ప్రయాణికులతో పాటు అటు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను అందోళనకు గురిచేస్తుంది. ఇంతవరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రవేశించాలంటే ఫ్లాట్ ఫాం టికెట్ 10 రూపాయలుగా ఉండేది. నేటి నుంచి ఈ టికెట్ ధర 20 రూపాయలు కానుంది. ఇప్పటికే ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ కావడంతో పెంచిన ధర అమలులోకి వచ్చింది. దీనిపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more