Girl accuses Alwar 'godman' of rape, police raid ashram మనవరాలి వయస్సున్న భక్తురాలిపై కీచక బాబా అత్యాచారం..

Rajasthan godman booked for sexually exploiting girl in alwar

Sant Kaushlendra Falahari Maharaj, 21-year-old Chhattisgarh girl, Jaipur police, Jaipur crime, Gurmeet Ram Rahim, Arvali Vihar Police Station, Bilaspur police station, Alwar godman, crime

A 21-year-old girl from Chhattisgarh has lodged a rape case against a famous self-styled 'godman' of Alwar, Sant Kaushlendra Falahari Maharaj.

కీచక సాధువు.. మనవరాలి వయస్సున్న భక్తురాలిపై అత్యాచారం..

Posted: 09/21/2017 09:37 AM IST
Rajasthan godman booked for sexually exploiting girl in alwar

అరచేతిలో వైకుంఠం చూపి, వారు కష్టంతో సాధించుకున్న ఏ పనినైనా తమ దయ వల్లే సాధ్యమైంయ్యిందని చెప్పుకుని.. అదను చూసి వారిపై లైంగిక దాడులకు తెగబడుతున్న సాధువుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. పంజాబ్, హర్యానాలో గుర్మిత్ రామ్ రహీం సింగ్, కర్ణాటకలో నిత్యానంద, అశారాం బాపు ఇలా ఎందరెందరో తమ భక్తులపై అత్యాచారాలకు పాల్పడిన వాల్లే. ఏకంగా లక్షల సంఖ్యలో భక్తులున్న స్వామీజీలే తమ భక్తులపై దారుణాలకు పాల్పడుతున్న క్రమంలో దొంగబాబాల జాబితా కూడా విడుదలైంది.

స్వామీజీల అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్న క్రమంలోనే మరో బాబా కూడా తానేం తక్కువా అన్నట్లుగా తన మనవరాలి వయస్సులో వున్న ఓ భక్తురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయం బయటకు చెబితే తాన భక్తులు ఏం చేస్తారో తనకే తెలియదని కూడా హెచ్చరికలు చేశారని, తన భక్తులు ఉన్నత స్థాయిలో వున్న పోలీసు అధికారులు వున్నారని బాధితురాలిని బెదిరింపులకు గురి చేశారు. చివరకు ధైర్యంతో తన తల్లిదండ్రుల అండతో ఏకంగా ఉత్తరాఖండ్ డీజీపీకి బాధితురాలు పిర్యాదు చేయడంతో అతని అకృత్యం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌ ఘడ్‌ లోని బిలాస్‌ పూర్‌ కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్ షిప్ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదే పట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. తాను తొలిసారి అర్జించిన వెతనాన్ని బాబుకు విరాళంగా ఇచ్చేందుకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది. హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన 70 ఏళ్ల బాబా, తన మనవరాలి వయస్సులో వున్న 21 ఏళ్ల యువతిని చూసి తలుపు గడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు.

దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో ఆమె తన సోదరినికి తీసుకుని బిలాస్ పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు నిమిత్తం బాబా ఆశ్రమానికి వెళ్లారు. అయితే ఆశ్రమంలో ఆయన కనిపించలేదు. వేరే దగ్గర ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న బాబా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలుసుకున్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులకు ఐసీయూలో బాబాను చూసి విచారించకుండా వెనుదిరిగారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles