వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోమారు ప్రభుత్వంతో పోరుకు సన్నధమయ్యారు. సదావర్తి భూముల విషయంలో 87 ఏకరాల భూమిని రూ. 22 కోట్లకు విక్రయించేందుకు ప్రభుత్వం సన్నధం కాగా, వాటిపై న్యాయపోరాటం చేసిన అర్కే.. ఎట్టకేలకు ప్రభుత్వం విక్రయించే ధరకంటే రెండున్నరింత లాభాన్ని ప్రభుత్వ ఖాజానాకు వచ్చేట్టు చేశారు. ఇక వీటి కన్న ముందు హైకోర్టును ఆశ్రయించిన ఆయన ఓ మూడేళ్ల క్రితం నుంచి అక్రమంగా సాగుతున్న అంశమై ఆయన మరోమారు హైకోర్టును అశ్రయించారు.
కృష్ణానది పరివాహక కరకట్ట ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పరివాహిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు నిర్మించిన 57మందికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం తహశీల్దార్ అక్రమనిర్మాణాలను గుర్తించి నోటీసులను జారీ చేసిన నేపథ్యంలో తాను వాటిని తొలగించాలని హైకోర్టును అశ్రయించానని చెప్పారు.
అయితే కృష్ణ నది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును తామిచ్చిన పిల్ నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2016లో అదేశించిందని చెప్పారు. న్యాయస్థానం అదేశాల మేరకు తాను అనేక పర్యాయాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు విభాగం అధికారులకు వినతులు ఇచ్చినా వాటిపై స్పందించలేదని చెప్పారు. దీంతో మరోమారు తాను హైకోర్టును అశ్రయించక తప్పలేదని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని లింగమనేని గ్రూపు నుంచి బలవంతంగా లాక్కును లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నారని అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more