దేశ ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని అటు వివిధ దేశాల నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ఇటు పలువరు జాతీయ నేతల నుంచి రాష్ట్రస్థాయి నేతలు, సామాన్య ప్రజలు.. ఇలా అనేకమంది పార్టీల కతీతంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే అర్ఎస్ఎస్ఎస్ కు చెందని ప్రముఖులు కూడా నరేంద్రమోడీకి వినూత్న తరహాలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతటితో అగని అర్ఎస్ఎస్ఎస్ నేతలు ప్రధానికి బహుమతులను కూడా పంపారు.
అయితే ప్రధానికి పంపిన బహుమతులు ఏంటా..? అని అలోచిస్తున్నారా.. ప్రధాని నరేంద్రమోడీ 67 జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న క్రమంలో.. ఆయనకు 68 పైసలతో 400 చెక్కులను పంపారు అర్ఎస్ఎస్ఎస్ నేతలు. అదేంటి 68ఫైసల చెక్కులా అంటారా..? అవునండీ.. ఇది నిజం. ఎందుకలా..? అంటే.. అదే తమ వినూత్న నిరసన అంటున్నారు ఆ నేతలు. అసలు అర్ఎస్ఎస్ఎస్ అంటే ఏంటీ అంటారా..? రాయలసిమ సాగునీటి సాధన సమితి. అర్రే.. మన రాష్ట్రవాసులేగా అంటే ముమ్మాటికీ మన రాయలసీమకు చెందినవారే. వీరింతా కలసి ప్రధాని మోడీకి 68 పైసల చెక్కులను కానుకగా పంపారు.
ఎందుకిలా అంటే.. దేశంలోనే థార్ ఎడారి తర్వాత అనంతపురం జిల్లా అత్యల్ప వర్షాపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకెక్కినా.. పాలకులకు మాత్రం ఇది పట్టకపోవడం.. ఇక్కడి రైతుల అక్రంధనలు.. అరణ్యరోధనలుగా మిగిలిపోవడం.. అపన్నహస్తం కోసం ఎదురుచూసి.. ఎదురుచూసి.. నిరీక్షణలో నిరసించి.. చేసేది లేక ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా తమ నిరసన వ్యక్తం చేశామంటున్నారు అర్ఎస్ఎస్ఎస్ సభ్యులు. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఇలా తమ నిరసనను వ్యక్తం చేశామంటున్నారు ఆ సభ్యులు.
‘రాయలసీమ నాలుగు జిల్లాలో సాగునీటి వసతిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. అయితే ఇక్కడ కేవలం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న కారణంతో కోస్తాంధ్రా అభివృద్ధిపైనే దృష్టిసారిస్తున్నారు. సాయం చేయాల్సిన కేంద్రం కూడా ఇక్కడి రైతులను పట్టించుకోవటం లేదు. అందుకే తమ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా నిరసనను తెలియజేశాం’ అని ఆర్ఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more