తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. నాటిన మొక్కలన్నీ చెట్లుగా ఎదుగుతున్నాయని ఇటు అటవీ శాఖ అధికారులు కూడా లెక్కలు చెప్పడం ఇప్పటి వరకు నిజమనే నమ్మశారు తెలంగాణ వాసులు. అయితే ఈ లెక్కలలో కొన్ని తప్పుడు లెక్కలు కూడా వున్నాయన్నిది తాజాగా నిరూపితం అయ్యింది. ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు తన స్వహస్తాలతో నాటిన మొక్క వాడిపోవడంతో ఈ నిజం వెలుగుచూసింది.
కరీంనగర్ జిల్లా మానేర్ కట్ట దిగువన మహాఘని మొక్కను కేసీఆర్ మూడవ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా నాటారు, అయితే ఆ మొక్కను చెట్టుగా వృద్ది అయ్యేవరకు దాని బాగోగులు చూసుకోవాల్సిన అధికారులు మాత్రం నిద్రవావస్థలోకి జారుకున్నారు. హరితహారంలో బాగా అలసిపోయినట్లు వున్నారు. అంతే అలా నిద్రలోకి జారుకున్నారో లేదో ఇలా ఏకంగా మహాఘని మొక్క వాడిపోయింది, దీన్ని ఎలా బతికించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
దీనికి సంబంధించి కాపలాదారు ఓ కథనం వినిపిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ రాత్రి పది గంటల తర్వాత మూడు ద్విచక్రవాహనాలపై ఐదారుగురు వచ్చారని... వారంతా ఈ మొక్క వద్ద నిలబడి ఏదో చేస్తున్నట్టు తనకు అనిపించిందని... వారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా, తనను తిడుతూ వారు వెళ్లిపోయారని అతను చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే బల్దియా పర్యవేక్షకుడికి చెప్పానని తెలిపాడు. అయితే, ఆ రోజు నుంచి ఆ మొక్క క్రమంగా వాడిపోవడం మొదలైందని చెప్పారు. మరోవైపు, ముఖ్యమంత్రి నాటిన మొక్క పరిస్థితే ఇలా ఉంటే... ఇతర మొక్కల పరిస్థితి ఏమిటని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more