తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడైన అమె ప్రియుడు సాయి కిరణ్ రెడ్డి.. పెళ్లి చేసుకోవాలని చాందిని తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నందునే అమెను హతమార్చానని చెప్పడం కూడా అబద్దమేనని తేలింది. అమీన్ పూర్ లోని నిర్జన గుట్టల ప్రాంతంలోకి చాందినిని తీసుకువెళ్లిన సాయికిరణ్ అమెను అతిదారుణంగా హతమార్చాడానికి గల కారణాలు అలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
తన వీధిలో క్రికెట్ అడుతున్నానంటూ ఏకంగా పోలీసుల ఎదుటే చెప్పుకోచ్చిన సాయికిరణ్ రెడ్డి. ఆ తరువాత పోలీసు మార్కు ట్రీట్ మెంట్ తో నిజాన్ని అంగీకరించాడు. అయితే అక్కడ కూడా అమ్మాయి పెళ్లికి ఒత్తిడి తీసుకువచ్చినందునే ఇలా చేశానని చెప్పుకోచ్చిన నిందితుడు అసలు నిజాలను మాత్రం చెప్పలేదు. అయితే ఈ కేసును సిరీయస్ గా టేకప్ చేసిన పోలీసులు నిందితుడు ఓ ప్రణాళిక ప్రకారమే చాందినిని హతమార్చాడని తెలిపారు. అయితే చాందినిని సాయికిరన్ రెడ్డి హతమార్చడానికి కారణం మాత్రం పూర్తి భిన్నంగా వుంది.
ఈ నెల 1 నుంచి 3 వరకు చాందిని తన పాఠశాల విద్యార్థులతో కలసి నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ పేరిట గెట్ టూగెదర్ మీట్ ను ఏర్పాటు చేశారు. సుమారుగా రెండు రోజుల పాటు దాదాపుగా 50 మంది మైనర్ విద్యార్థులు నగరంలోని సెంట్రల్ కోర్టు హోటల్ లో ఐదు గదులు తీసుకుని అక్కడే బస చేసిన మద్యం సేవించి మరీ ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే ఈ కార్యక్రమంలో చాందినితో సాహెల్ అనే యువకుడి పరిచయమయ్యాడు. విరిద్దరి మధ్య సన్నిహిత్యం కూడా వుండింది.
దీంతో తనతో కాకుండా సాహెల్ తో క్లోజ్ గా మూవ్ అవుతుందన్న అక్కస్సుతోనే చాందినిని సాయికిరణ్ రెడ్డి హతమార్చాడన్న నిజం ఇప్పుడు తాజాగా వెలుగుచూస్తుంది. క్షణికావేశం, పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి తీసుకురావడం అంటూ కల్పిన కథలను వల్లించిన సాయికిరణ్.. అమెను హత్యచేయడానికి అసలు కారణం మాత్రం చాందిని తనకు దూరం కావడమేనని పోలీసుల విచారణతో వెల్లడైంది. మరొకరితో సన్నిహితంగా మెలగడం ఇష్టం లేకనే సాయికిరణ్ చాందినిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more