రాష్ట్రాభివృద్దిలో భాగంగా నియోజకవర్గాలను కూడా అభివృద్ది చేయాలన్న అంకితభావంతో అన్ని నియోజకవర్గాలతో పాటు విపక్ష నేతల నియోజకవర్గాలకు కూడా నిధులు కేటాయిస్తున్నామని అంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ వాఖ్యనించడం చర్చనీయాంశంగా మారింది. అన్ని నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేసినప్పుడు ప్రత్యేకంగా విపక్ష సభ్యులకు కూడా నిధులను మంజూరు చేస్తున్నామని చెప్పడంలో అంతర్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతే అధికార, విపక్షాలకు మధ్య తేడా ఉందని ప్రభుత్వవైఖరిని అయన ప్రస్పూటిస్తున్నారా..? అని విపక్ష్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
విజయనగరంలో జిల్లాలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాంలో పాల్గోన్న ఆయన పార్టీ పరంగా వ్యాఖ్యలు చేయాల్సింది పోయి.. ప్రభుత్వ పాలనాపరమైన వ్యాఖ్యలను చేయడం ఏంటని విపక్షనేతలు నిలదీస్తున్నారు. లోకేష్ కు ఎక్కడ ఏం మాట్లాడాలోకూడా తెలియని అపరిపక్వతస్థితి అంటూ మండిపడ్డారు. ఇక తమ పార్టీ అధినేత జగన్ అడగకపోయినా.. ఆయన నియోజకవర్గానికి రూ. 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని ప్రకటించుకోవడంలో లోకేష్ అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
తమ ప్రభుత్వ పారదర్శకమైనదని తమకు తాము గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి.. తన పార్టీ నుంచి గత నెల మొదటివారంలో ఎందుకు రాజీనామా చేసి వెళ్లారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వెళ్తూ వెళ్తూ.. టీడీపీ ప్రభుత్వంపైనా.. పార్టీ పైనా ఏమేమి విమర్శలు చేశారో నారా లోకేష్ తెలుసుకోవాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసలు లోకేష్ ఏమన్నారంటే.. జగన్ అడగకపోయినా... ఆయన నియోజకవర్గం పులివెందులకు రూ. 10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more