తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యకేసులో మిస్టరీని చేధించిన పోలీసులు.. అమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే చాందినిన చంపానని అంగీకరించాడు. తనను పెళ్లి చేసుకోమ్మని గత కొంతకాలంగా వేధిస్తున్న క్రమంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పినా వినిపించుకోని చాందిని.. తనను వత్తిడి చేసిందని.. దీంతో ఈ విషయమై చర్చించేందుకు నిత్యం వెళ్లే అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లానని చెప్పాడు. అయితే చాందినిని తాను చంపాలని అనుకోలేదని.. క్షణికావేశం వల్లే ఈ హత్య జరిగిందని సాయికిరణ్ చెప్పాడు.
అసలు అమీన్ పూర్ గట్టల్లో ఎం జరిగిందంటే...?
అమీన్ పూర్ నిర్జన ప్రాంతానికి వెళ్లిన తామ మధ్య మరోమారు పెళ్లి విషయం చర్చకు వచ్చిందని సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఇప్పుడే తాను పెళ్లి చేసుకోలేనని, సెటిల్ అయిన తరువాత తప్పక పెళ్లి చేసుకుంటానని చెప్పానని, అయినా వినని చాందిని తనతో వాగ్వాదానికి దిగిందని, దీంతో చేసేది లేక తాను చాందినిని చెంపపై కొట్టానని వెల్లడించాడు. దీంతో చాందిని బిగ్గరగా అరవడం మొదలుపెట్టిందని.. ఈ ఆకస్మాత్తు చర్యతో తాను చాందిని గొంతు నులిమానని.. ఇంతలో అమె పడిపోయిందని, తన స్నేహితులు వచ్చి తనతో చాందని చనిపోయిందని చెప్పారని.. ఇదంతా అమీన్ పూర్ కు వెళ్లిన ఐదు నిమిషాలలోనే జరిగిపోయిందని నిందితుడు చెప్పాడు.
సీన్ రికస్ట్రక్షన్ ద్వారా ఏం తెలిసింది..?
అయితే తమదైన స్టైయిల్ లో విచారించిన పోలీసులు.. సీన్ రికస్ట్రక్షన్ లో మరిన్ని అసక్తికర విషయాలను తెలుసుకున్నారు. చాందినిన వదిలించుకునే ప్రయత్నం చేసిన సాయికిరణ్.. అమెను గత అరు మాసాలుగా దూరంగా పెట్టినా.. అమె వెంటపడటం మానలేదు. దీంతో చాందినిని అంతం చేయడం తప్ప మరోమార్గం లేదని భావించిన సాయి కిరణ్ అమెను ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటలకు అమీన్ పూర్ గుట్టల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య పెళ్లి టాపిక్ వచ్చింది.
దీంతో అమెను కొట్టాడు., అమె కేకలు వేయగానే గొంతు నులిమాడు. ఇక తన పథకం ప్రకారం అమెను అంతం చేసేందుకు తలపై, మెడపై బలంగా కొట్టాడు. అమె చనిపోలేదన్న అనుమానంతో అమెను బలంగా లోయలోకి తేసేశానని సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు. చాందని లోయలో ఎలా పడిందన్న పోలీసుల ప్రశ్నతో ఈ విషయాన్ని చెప్పాడు సాయికిరణ్. తామిద్దరం 9వ తరగతి నుంచి ఒకరినోకరుం ఇష్టపడుతున్నామన్నారు.
అయితే ఎన్నడూ నేరం చేయనివాడు నేరానికి పాల్పడితే.. అతనిలో భయం అవహించి.. నిజాలను చెప్పేస్తాడు. కానీ సాయికిరణ్ లో నేరప్రవృత్తి రక్తంలోనే వున్నట్లుంది. అందుకనే తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాందిని కనిపించడం లేదని అమె తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసిన తరువాత తనకేమీ తెలియనట్లు.. ఏకంగా వారింటికి వెళ్లి మరీ పరామర్శించి రావడం.. చాందిని కుటుంబ సభ్యులను కలవడం.. మాత్రం అటు పోలీసులను, ఇటు చాందిని తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more