హైదరాబాదుతో పాటు యావత్ తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యకేసును పోలీసులు ఛేదించారు. చాందినీ సెల్ ఫోన్ అధారాంగా ఈ కేసును చేధించారు పోలీసులు. చాందిని ఫోన్ లో ఓ నెంబర్ ను అమె మై హాట్ అని సేవ్ చేసుకుంది. అదే నెంబరుపై అనుమానంతో విచారణ సాగించిన పోలీసులు మై హాట్ నెంబరు సాయికిరణ్ అనే అమె ప్రియుడిదేనని తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఈ హత్యకు పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు.
పెళ్లి విషయంతో చాందినీ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది... అయితే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేని కారణంగానే పథకం ప్రకారం ఆమెను హత్య చేశానని సాయిచరణ్ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. మియాపూర్ లోని మదీనాగూడలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సాయికిరణ్ అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ కేసులో అసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ముందస్తుగా వేసుకున్న పథకంలో భాగంగానే చాందినిని నగర శివారు అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడని తేల్చారు. అయితే ఆ సమయంలో ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.
చాందిని, సాయికిరణ్ గత రెండేళ్లుగా ఒకరినోకరు ఇష్టపడుతున్నారు. మంచి మిత్రులుగా వున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2015 నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే మోజు తిరిందో ఏమో కానీ గత అరు నెలలుగా చాందినీని సాయికిరణ్ దూరం పెడుతు వస్తున్నాడు. ఇది ఇష్టంలేని చాందిని సాయికిరణ్ వెంటపడుతుంది. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తడి తీసుకువచ్చింది. దీంతో అమెను ఎలాగైన వదిలించుకోవాలన్న సాయికిరణ్ ఈ విషయంపై మాట్లాడాలని చెప్పి ఈనెల 9న అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు.
అయితే నేరప్రవృత్తి వంట్లోనే వుందో.. లేక ప్రవహించే రక్తంలోనే వుందో.. లేక సినిమాలు, సీరియళ్ల ప్రభావమో తెలియదు కానీ.. చాందినిని హత్యచేసిన తర్వాత కూడా సాయికిరణ్ చాందిని ఇంటికి వెళ్లాడు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా చాందిని కుటుంబ సభ్యులను కలిశాడు. తమ బిడ్డకి మంచి స్నేహితుడిగా ఉండే సాయికిరణ్ ఈ హత్య చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చాందిని తల్లి విలపించారు. ఇష్టం లేకపోతే తన కూతురును వదిలేయాలి కానీ ఇలా నమ్మించి.. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విగతజీవిగా మారుస్తారా..? అంటూ కన్నీళ్లపర్యంతమయ్యంది.
ఈ హత్యను సాయికిరణ్ ఒక్కడే చేసి ఉండడని… ఇంకా ఎవరైనా ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయికిరణ్ తనకు చేతికి దోరికితే చంపేస్తానని అగ్రహాన్ని వ్యక్తం చేసింది. చిన్నవయస్సులోనే ఇంతటి దారుణానికి పాల్పడిన నేరగాడ్ని ఘటనాస్థాలానికి తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేయాలని కోరుతుంది. కాగా, మియాపూర్ పోలీసులు సాయికిరణ్ ను ఘటనాస్థాలానికి తీసుకెళ్లి ఎలా హత్య చేశాడన్న సీన్ రికస్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు సాయికిరణ్ ను అరెస్టు చేసి మీడియాకు ముందు ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more