దేశ ప్రధానినే టార్గెట్ చేసి.. అ ట్విట్ తాను చేయలేదని, ఎవరో తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి ప్రధానికి వ్యతిరేకంగా అత్యంత అసభ్యకర రీతిలో ట్విట్ ను పోస్టుచేశారని కవరింగ్ ఇచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ ను మాత్రం నేరుగానే టార్గెట్ చేశారు. బాబా రాందేవ్ ను దొంగ బాబా అని నేరుగానే విమర్శించారు. అఖిల భారతీయ ఆకార పరిషత్ తాజాగా విడుదల చేసిన 14 మంది దొంగ బాబాల పేర్లలో బాబా రాందేవ్ పేరును ఎందుకు చేర్చలేకపోయిందోనని తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయుర్వేదం పేరుతో.. దేశ ప్రజలను మోసం చేసి నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని సొమ్మ చేసుకుంటున్నాడని ఆరోపించారు. అఖిల భారతీయ ఆకార పరిషత్ జాబితాలోని బాబాలు తమ వద్దకు వచ్చిన భక్తులనే మోసం చేస్తుండగా, బాబా రాందేవ్ మాత్రం.. టీవీలు, పేపర్లలో ప్రకటనలు గుప్పించి మరీ ప్రజలను మోసం చేస్తున్నాడని అరోపించారు. అదే పేరుతో ఇటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఉచితంగా ప్రభుత్వ భూమిని పోందుతూ.. వాటిలో తన సంస్థ కార్యకలాపాలు సాగిస్తూ.. వాటిని దేశప్రజలకు విక్రయించి డబ్బును అర్జిస్తున్నాడని అరోపించారు.
ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మిక వేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ను అడిగారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక అఖిల భారతీయ ఆకార పరిషత్ విడుదల చేసిన జాబితాలో ఆశారాం బాబు, రాధేమా, సచ్ దరంగి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఓం బాబా, నిర్మల్ బాబా, విశ్వానంద్, స్వామి అశ్మిదానంద్, ఓం నమః శివాయ్, నారాయణ్ సాయి రాంపాల్ లు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more