ఆయన ఓ కాంగ్రెస్ నాయకుడు. అంతేకాదు బాదేపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ గా కూడా సేవలు చేశాడు. దీంతో డబ్బు, దస్కం బాగానే అర్జించాడు. ఇంకేముందు.. శ్రీశైలం హైవేపై మార్గంలోని జడ్చర్లకు రియల్ బూమ్ రావడంతో.. తన కుటిల అలోచనలతో పక్కింటిని కొనాలన్న దురాశ కలిగింది. దీంతో పక్కింటి వారిని ఇల్లు అమ్మాలని డిమాండ్ చేసి.. వారు నిరాకరించడంతో.. చేయకూడని పనులకు కూడా పాల్పడి.. పెద్ద మనిషన్న గౌరవాన్ని కూడా కొల్పోయాడు.
పోలీసుల కథనం ప్రకారం రామచంద్రారెడ్డి ఇంటిపక్కనే హెడ్ కానిస్టేబుల్ వేమారెడ్డి ఇల్లు వుంది. అయితే పదవీ విరమణ పోందిన తరువాత నుంచి ఇల్లు అమ్మాలని పలుమార్లు రామచంద్రారెడ్డి కోరాడు. ఉన్న ఇంటిని అమ్మలేనని చెప్పిన వేమారెడ్డి గత కోన్నేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడి మరణించాడు. దీంతో అతని భార్య విజయలక్ష్మీని ఇల్లు అమ్మాలని వేధించసాగాడు. వారు కూడా అందుకు నిరాకరించడంతో.. కక్ష పెంచుకున్న రామచంద్రారెడ్డి.. వారింటి ముందు చేతబడుల తరహాలో నిమ్మకాయలు, ఉల్లిపాయలు, పసుపు, కుంకుమలు వేసి భయాందోళనకు గురిచేశాడు. అయినా వేమారెడ్డి కుటింబికులు ఇల్లు విక్రయానికి నిరాకరించారు.
తాజాగా రామచంద్రారెడ్డి కన్నుపడిన గ్రామపంచాయితీ భూమిని కబ్జా చేసేందుకు యత్నించగా, దానిని కూడా వేమారెడ్డి కుటుంబికులు అడ్డుకున్నారు. దీంతో వారిపై మరింత కక్షగట్టిన ఈ కాంగ్రెస్ నేత.. వారింటి అవరణలో, ద్వారల ముందు, దుకాణాల ఎదుట మల, మూత్రాలు పారబోసాడు. అయితే ప్రతిరోజు జరుగుతున్న ఈ తంతంగంతో విరక్తి చెందిన జయలక్ష్మీ.. హైదరాబాద్లో ఉన్న తమ కుమారుడు కేశవర్ధన్ రెడ్డికి విషయం తెలుపగా, జడ్చర్లకు చేరుకున్న అతను నిఘా పెట్టాడు. అర్థరాత్రి రాత్రి 2 గంటల సమయంలో తన ఇంట్లో నుంచి రెండు ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన రామచంద్రారెడ్డి ఆ కవర్లలో ఉన్న మల, మూత్రాలను తమ ఇంటి ముందు పారబోస్తుండగా రెడ్ హ్యాండ్ండ్ గా పట్టుకుని చెట్టుకు కట్టేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more