1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన అరుగురికి టాడా కోర్టు ఇవాళ శిక్షలను ఖారారు చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా తేలి.. 257 మంది ప్రాణాలను బలిగొన్న వారిగా తేలిన దోషికి మరణ శిక్షను ఖారారు చేసిన న్యాయస్థానం.. ఈ మరణాలకు పరోక్షంగా కారకులైన మరో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు శిక్షను విధించింది. మరో దోషికి పదేళ కఠిన కారాగార శిక్షను విధించింది.
ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను దోషులుగా నిర్థారించిన న్యాయస్థానం ఇవాళ వారికి శిక్షలను ఖరారు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం టాడా ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో దేశప్రజల ప్రాణాలను బలిగోన్న తాహీర్ మర్చెంట్ అలియాస్ తాహీర్ తాఖియ్యాకు మరణశిక్షను విధించింది. అతనితో పాటు ఈ వరుస పేలుళ్లకు కీలక వ్యక్తిగా భావించిన ఫిరోజ్ ఖాన్ కు కూడా మరణశిక్షను విధించింది. అయితే కేసు విచారణలో చనిపోయిన మరో దోషి ముస్తఫా దోస్సాకు కూడా న్యాయస్థానం మరణ శిక్షను విధించింది.
కాగా, భారత్ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడైన అబు సలేంకు టాడా కోర్టు జీవిత ఖైదు శిక్షను ఖారారు చేసింది. అతనితో పాటు ఈ కేసులో దోషిగా తేలిన కరీముల్లాకు కూడా న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. వీరితో పాటు ఈ కేసులో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన రియాజ్ సిద్దిఖీకి టాడా కోర్టు పదేళ్ల శిక్షను విధించింది. ఈ కేసులో కీలక నిందితుడైన అబుసలేం.. పోర్చుగల్ విమానాశ్రయంలో మారువేశంలో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన ఇంటర్ పోల్ అధికారులు.. ముంబై పోలీసులు సంయుక్తంగా అతన్ని పట్టుకుని.. భారత్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
1993లో మార్చి 12న జరిగిన ముంబై వరస బాంబు పేలుళ్లలో 257 మంది అసువులు బాయగా, 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రభావం భారత అర్థిక రాజధాని ముంబైపై తీవ్రంగా పడింది. ఏకంగా 27 కోట్ల రూపాయల అస్థినష్టం కూడా వాటిల్లింది. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తును ప్రారంభించగా, ఆ తరువాత ఈ కేసును సిబిఐకి బదిలీ చేశారు. 24 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో దోషులకు టాడా ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించింది. దీంతో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more