రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి మృత్యువాత పడ్డారు. దైవసన్నిధికి వళ్తి తిరిగుపయనం అవుతున్న క్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో అమెతో పాటు మరో నటుడు కూడా మృత్యువాత పడగా, మరో నలుగురు నటీనటులు తీవ్ర గాయాలపాలయ్యారు. అయినా కన్నడ టీవీ నటి, నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తూన్న క్రమంలో రోడ్డుపై నిలిపిన వాహనాన్ని గమనించికుండా ఢీకొన్నడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
కన్నడ టీవీ సీరియళ్లలో తనకంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటి రచనతో పాటు నటుడు జీవన్ కూడా ఈ ప్రమాదంలో అసువులుబాసారు. 'మహానది', 'త్రివేణి సంగమ', 'మధుబాల' వంటి కన్నడ సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించిన రచన (23), జీవన్ (25) లు రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. కార్తిక్ అనే టీవీ నటుడి పుట్టినరోజును పురస్కరించుకుని, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్, జీవన్, రచన బెంగుళూరు సమీపంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లారు.
కార్తీక్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించి, పార్టీ చేసుకున్నారు. తెల్లవారు జామున సఫారీలో బెంగళూరు తిరిగి ప్రయాణమయ్యారు. మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను వారు ప్రయాణిస్తున్న సఫారీ ఢీకొట్టింది. వేగంగా వస్తూ ఢీ కొట్టడంతో రచన, జీవన్ అక్కడికక్కడే మృతి చెందగా, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, పాంకేతిక లోపాలు తలెత్తడంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహానాలను నిలపడం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవలే అందోళన కలగించే సంఖ్యలో గణాంకాలను రోడ్డు భద్రతావారోత్సవాల సందర్భంగా కేంద్రం విడుదల చేసినా వాహనదారులకు ఏ మాత్రం పట్టనట్లుగా వుంది. అలాంటి వాహనాలు రోడ్డుపై అడ్డంగా నిలపివేయడంతోనే ఈ ప్రమాదం కూడా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై రహదారుపై వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపరాదని విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more