తెలంగాణకు చెందిన దంపతులపై జార్ఖంగ్ రాష్ట్రంలో పోస్టర్లు వెలుస్తున్నాయి. ఈ పోస్టర్లను ముద్రించింది స్వయంగా ఆ రాష్ట్ర పోలీసులే. ఈ దంపతులపై జార్ఖండ్ రాష్ట్ర పోలీసులు ఏకంగా 35 లక్షల రూపాయల నజరానాను ప్రకటించారు. అదేంటో అర్థంకాలేదా..? ఈ దంపతులిద్దరూ మావోయిస్టు కీలక నేతలు. తెలంగాణకు చెందిన వీరు.. మావోయిస్టు సిద్దాంతాలకు అకర్షిుతులై.. ఏకంగా జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ మావోయిస్టు కార్యకాలపాల్లో నిమగ్నమయ్యారు. సుధాకర్ ఏకంగా పీఫుల్స్ లిబరేషన్ గొరిల్లా అర్మీ దళం కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదుగాడు. కాగా ఆయన భార్య నీలిమా ప్రత్యక కమిటీ మెంబర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
దీంతో సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఈ మావోయిస్టు దంపతులను పట్టిచ్చిన వారికి భారీ నజరానా ప్రకటిస్తున్నట్లు పోలీసులు పోస్టర్ల ద్వారా ప్రకటించారు. వీరిని చంపినా, సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినా భారీ నజరానా ఇస్తామని జార్ఖండ్ ప్రకటించింది. జార్ఖండ్ పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్న మావో నేతల జాబితాలో 12 పేర్లుండగా, వీరిద్దరే అగ్రస్థానంలో ఉన్నారు. ఇక సుధాకర్ తలపై రూ. 25 లక్షలు, నీలిమ తలపై రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని జార్ఖండ్ పోలీసులు గోడ పత్రికలను ప్రచురించారు.
ఇక ఈ జాబితాలో పేర్లున్న పలువురు మావోయిస్టుల వివరాలు ఇలా వున్నాయి. పీఫుల్స్ లిబరేషన్ గొరిల్లా అర్మీ దళం జోనల్ కమాండెర్లు రవీంద్ర గంఝూ, దీపక్ ఓరాన్, భూషణ్ ఓరాన్, బలరామ్ ఓరాన్, మునేశ్వర్ ఓరాన్ ల తలపై పది లక్షల రివార్డును ప్రకటించారు. వీరితో పాటు పీఫుల్స్ లిబరేషన్ గొరిల్లా అర్మీ దళం సబ్ జోనల్ కమాండర్లుగా కొనసాగుతున్న యుగేశ్వర్ యాదవ్, అగ్నూ గంఝూ, బాలక్ గంఝూలపై ఐదు లక్షల రివార్డు, ఇద్దరు ఏరియా కమాండర్లు అనీల్ తూరి, గోవింద్ బిర్జియాలపై కూడా నగదు రివార్డును ప్రకటించారు.
ఇప్పటివరకూ 30 మంది అగ్ర నాయకులను అరెస్ట్ చేశామని, పలువురు వయో భారంతో చురుకుగా లేకపోగా, సుధాకర్, నీలిమ విస్తృతంగా పర్యటిస్తూ, క్యాడర్ ను పెంచుకుంటున్న కారణంగానే, వీరిని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తమ ఇంటెలిజెన్సు వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వారు గుమ్లా జిల్లాలోని అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారని, వారిని త్వరలోనే తమ సిబ్బంది పట్టుకుంటారని లోహర్డగా ఎస్పీ కార్తీక్ సేన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ లోపు రక్తసిక్తమైన మార్గాన్ని వారు స్వచ్చందంగా వీడి.. తమకు తాముగా ఆ దంపతులే జనజీవన స్రవంతి లోకి చేరాలని కార్తీక్ సేన్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more