భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ ను ముస్లిం నెటిజన్లు మళ్లీ ఏకిపారేశారు. అయతే ఈసారి ఆయన ముస్లిం మతాచారాలకు విరుద్దంగా ఏమీ చేయకుండానే అయనపై విమర్శలు గుప్పించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రితం రోజున ట్రిపుల్ తలాఖ్ అంశంపై వెలువరించిన సంచలన తీర్పును యావత్ దేశ ప్రజల మాదిరిగానే ఆయన స్వాగతించారు. హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తరహాలోనే ఆయన కూడా స్వాగతిస్తూ.. ఇకపై ముస్లింలలో కూడా మహ్మదీయ మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని అశాభావాన్ని వ్యక్తం చేస్తూ.. దీంతో లింగ సమానాత్వం సాధ్యమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
దీంతో ముస్లిం నెటిజన్లు మరోసారి ఆయనపై విమర్శల వర్షం గుప్పించారు. దీనికి స్పందనగా ముస్లిం నెట్ జనుల నుంచి తీవ్రస్థాయిలో ఆయన విమర్శలను అందుకున్నారు. ముస్లిం అయ్యివుండి ఇస్లాంలో మహిళలకు ఉండే రక్షణ సంగతి నీకు తెలియదా? అంటూ కొందరు కైఫ్ పై నేరుగా మాటల యుద్దానికి దిగారు. ఇక మరికోందరు ఖురాన్ చదివిన తర్వాత లింగసమన్యాయం గురించి మాట్లాడండి!`, `మీ మీద త్వరలో ఫత్వా జారీ అవుతుంది చూడండి!`, `ఇలాంటి పోస్టులు చేయకు కైఫ్!` ‘ ఎవరి మెప్పు పొందేందుకో మీరు ఇలాంటి పోస్టులు చేస్తూ.. ముస్లింలను అవహేళన చేయకండీ అంటూ వివిధ రకాలుగా ముస్లిం నెటిజన్లు స్పందించారు.
ఇది బీజేపి ఘనత కాదు: ఖుష్బూ
ట్రిపుల్ తలాక్ పై దేశ అత్యున్నత ధర్మాసనం నిన్న వెలువరించిన విజయాన్ని.. తమ విజయంగా బీజేపి మలుచుకుని దేశ ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకువెళ్లే ప్రయత్నాలను మొదలుపెట్టేసిందని నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ సుందర్ అన్నారు. దేశం సాధించే అన్ని విజయాలను తమ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నాలు చేయడం, క్రెడిట్ చేజిక్కించుకునే ప్రయత్నాలకు చేయడం బీజేపికి మంచిది కాదని అమె అన్నారు. ఈ ప్రయత్నాలతో ప్రజల చిత్కారానికి గురికాక తప్పదని అమె దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాక్ విజయం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ క్రెడిట్ కాదని అన్నారు. ఇది భారతీయ మహిళల విజయమని అమె పేర్కొన్నారు. 'సుప్రీంకోర్టు విడాకులపై నిషేధం విధించలేదు. కానీ, అప్పటికప్పుడు తలాక్ చెప్పే పద్దతిపై నిషేధం విధించిందని అమె వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more