సీటు అక్యూపెన్సీని పెంచుతూ నష్టాలను నివారించి, లాభాలతో ముందుకు సాగుతున్న చౌకధర విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రమోషనల్ స్కీమ్ లో భాగంగా ‘7 డేస్ మ్యాడ్ డీల్స్’ పేరిట ఇవాళ సరికొత్త ఆఫర్ ను తమ అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది. ఈ ఆఫర్ కింద అన్ని పన్నులు కలుపుకుని కేవలం రూ.999 కింద టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. మ్యాడ్ డీల్స్ కింది టికెట్లు బుక్ చేసుకునే కస్టమర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య తాము ఎంచుకున్న మార్గాల్లో ప్రయాణించే అవకాశాన్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 27 వరకు మ్యాడ్ డీల్స్ లో భాగంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ తన వెబ్ సైట్లో పేర్కోనింది.
మ్యాడ్ డీల్స్ అఫర్ కింద ఎన్ని సీట్లను అందిస్తున్నామన్న విషయాన్ని మాత్రం వెలువరించని ఎయిర్ ఏషియా.. పలు మార్గాల్లో.. పలు కీలక సమయాల్లో మాత్రం ఈ మ్యాడ్ డీల్స్ టికెట్లు వర్తించవని చెబుతోంది. అంతే కాకుండా ఎయిర్ ఏషియా దేశంలో పలు ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లు వర్తిస్తాయని చెప్పింది, ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆపర్ కింద సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయని ఎయిర్ ఏషియా ప్రతినిధులు తెలిపారు. వెబ్, మొబైల్ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
కాగా, కోల్కతా-బగ్దోగ్రా టికెట్ ధర రూ.999 నిర్దేశించిన సంస్థ.. కాగా, భువనేశ్వర్-కోల్కతా, గోవా-బెంగళూరు, గువాహటి-ఇంఫాల్, హైదరాబాద్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు మధ్య టికెట్ ధర రూ.1,099గా పేర్కొంది. అలాగే పుణె-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య ధరను రూ.1,499గా ప్రకటించింది. కొన్ని అంతర్జాతీయ విమాన టిక్కెట్లకు ప్రారంభ ధరను రూ.3,399గా నిర్ణయించినట్లు తెలిపింది. కౌలాలంపూర్-కొచ్చి, కౌలాలంపూర్-తిరుచ్చిరాపల్లి మధ్య టికెట్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఇక విశాఖ నుంచి కౌలాలంపూర్ టికెట్ ధరను రూ. 3599గా నిర్థారించింది. అలాగే కోల్ కతా నుంచి బ్యాంకాక్ టిక్కెట్ ధరను కూడా తగ్గించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more