AirAsia Offers Rs. 999 Tickets In 7-Day Sale. ఎయిర్ ఏషియా మ్యాడ్ డీల్స్ అదిరిపోయాయి

Airasia offers rs 999 tickets in 7 day sale

AirAsia, AirAsia India, AirAsia offer, AirAsia India offer, AirAsia Rs 999 tickets, AirAsia Rs 999, AirAsia Rs 1099, business news

AirAsia India is offering all-inclusive tickets starting at Rs. 999 for select one-way flights under a limited-period promotional scheme.

కస్టమర్లకు మ్యాడ్ డీల్స్ ప్రకటించిన ఎయిర్ ఏషియా

Posted: 08/22/2017 12:39 PM IST
Airasia offers rs 999 tickets in 7 day sale

సీటు అక్యూపెన్సీని పెంచుతూ నష్టాలను నివారించి, లాభాలతో ముందుకు సాగుతున్న చౌకధర విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా ప్రయాణికులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. ప్రమోషనల్ స్కీమ్ లో భాగంగా ‘7 డేస్ మ్యాడ్ డీల్స్’ పేరిట ఇవాళ సరికొత్త ఆఫర్ ను తమ అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది. ఈ ఆఫర్ కింద అన్ని పన్నులు కలుపుకుని కేవలం రూ.999 కింద టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. మ్యాడ్ డీల్స్ కింది టికెట్లు బుక్ చేసుకునే కస్టమర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య తాము ఎంచుకున్న మార్గాల్లో ప్రయాణించే అవకాశాన్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 27 వరకు మ్యాడ్ డీల్స్ లో భాగంగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని సంస్థ తన వెబ్ సైట్లో పేర్కోనింది.

మ్యాడ్ డీల్స్ అఫర్ కింద ఎన్ని సీట్లను అందిస్తున్నామన్న విషయాన్ని మాత్రం వెలువరించని ఎయిర్ ఏషియా.. పలు మార్గాల్లో.. పలు కీలక సమయాల్లో మాత్రం ఈ మ్యాడ్ డీల్స్ టికెట్లు వర్తించవని చెబుతోంది. అంతే కాకుండా ఎయిర్ ఏషియా దేశంలో పలు ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లు వర్తిస్తాయని చెప్పింది, ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆపర్ కింద సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయని ఎయిర్‌ ఏషియా ప్రతినిధులు తెలిపారు. వెబ్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

కాగా, కోల్‌కతా-బగ్దోగ్రా టికెట్‌ ధర రూ.999 నిర్దేశించిన సంస్థ.. కాగా, భువనేశ్వర్‌-కోల్‌కతా, గోవా-బెంగళూరు, గువాహటి-ఇంఫాల్‌, హైదరాబాద్‌-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు మధ్య టికెట్‌ ధర రూ.1,099గా పేర్కొంది. అలాగే పుణె-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య ధరను రూ.1,499గా ప్రకటించింది. కొన్ని అంతర్జాతీయ విమాన టిక్కెట్లకు ప్రారంభ ధరను రూ.3,399గా నిర్ణయించినట్లు తెలిపింది. కౌలాలంపూర్‌-కొచ్చి, కౌలాలంపూర్‌-తిరుచ్చిరాపల్లి మధ్య టికెట్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఇక విశాఖ నుంచి కౌలాలంపూర్ టికెట్ ధరను రూ. 3599గా నిర్థారించింది. అలాగే కోల్ కతా నుంచి బ్యాంకాక్ టిక్కెట్ ధరను కూడా తగ్గించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  AirAsia India  AirAsia offer  AirAsia Rs 999 tickets  AirAsia mad deals  business news  

Other Articles