కేంద్ర ప్రభుత్వం బాటలోనే తాజాగా భారతీయ స్టేబ్ బ్యాంకు కూడా నడుస్తుంది. అనుమానాస్పద ప్యాన్ కార్డులుగా సందేహాలున్న 11 లక్షల పర్మినెంట్ అకౌంట్ నెంబర్ కార్డులను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత.. ఇటీవల అధార్ కార్డులపై కూడా కేంద్రం వేటు వేసింది. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంకు కూడా అదే బాటలో పయనిస్తుంది. తన ఖాతాదారులలో కొందరి డెబిట్ కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేస్తూ ఎస్బీఐ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని కస్టమర్లకు మెసేజ్ల రూపంలో అందిస్తోంది.
అయితే తమ ఖాతాదారుల డెబిట్ కార్డులను ఏ కారణంతో శాశ్వతంగా బ్లాక్ చేస్తుందో కూడా ఎస్బీఐ తన వెబ్సైట్లో వివరించింది. అనుమానాస్పద బ్యాంకు అకౌంట్లు వున్నాయన్నదే కారణమా అంటే ఎంతమాత్రం కాదనే చెప్పాలి. మరి బ్యాంకు అధికారులు జారీ చేసిన కార్డులను నిర్ణీతం కన్నా తక్కువగా వినియోగించడమే కారణమా అంటే.. అది కూడా కాదు. అయితే బ్యాంకు అధికారులు తమ డెబిట్ కార్డులను ఎందుకని శాశ్వతంగా బ్లాక్ చేస్తున్నారన్న సందేహాలు వెంటాడుతున్నాయా..?
దానికి కూడా కారణాలు వున్నాయి. బ్యాంకు అధికారులు గతంలో జారీ చేసిన డెబిట్ కార్డులలో ఉత్పన్నమైన భద్రతా కారణాలే ఈ డెబిట్ కార్డును బ్లాక్ చేయడానికి ముఖ్యకారణం. భద్రతా ప్రమాణాలు అధికంగా కలిగిన ఈవీఎం చిప్ టెక్నాలజీని పోందుపర్చిన డెబిట్ కార్డులను బ్యాంకులు తమ కస్టమర్లకు అందించాలని భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల అదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందుకు స్టేబ్ బ్యాంకు పలు అకౌంట్లకు చెందిన డెబిట్ కార్డులను బ్లాక్ చేసి.. వారికి ఈవీఎం చిప్ పొందుపర్చిన డెబిట్ కార్డులను జారీ చేయనుంది.
ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రతా కారణాలతో మ్యాగ్స్ట్రైప్ డెబిట్ కార్డును శాశ్వతంగా బ్లాక్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు వెంటనే బ్యాంకును కాంటాక్ట్ చేయాలని లేదా అన్ లైన్ ద్వారా.. బ్యాంకు వెబ్ సైట్ అడ్రస్ www.onlinesbi.com కు చేరుకుని తద్వారా తమ డెబిట్ కార్డులను మార్చుకోవాలని భారతీయ స్టేట్ బ్యాంకు సూచించింది. అయితే ఈ నూతన డెబిట్ కార్డుల కోసం ఖాతాదారులు ఏ ఒక్క పైసాను కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు.. వీటిని ఉచితంగానే కస్టమర్లకు అందిస్తోంది.
మ్యాగ్నిటిక్ స్ట్రైప్ ఆధారిత ఏటీయం డెబిట్ కార్డులతో జరుగుతున్న మోసాల నుంచి రక్షించడానికి, ఈవీఎం చిప్, పిన్ ఆధారిత మోడల్స్ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు.. చిప్ కార్డు ఆధారిత ఏటీయం మోడల్స్లోకి మారాల్సిందేనని తెలిపింది. డెబిట్ కార్డును దగ్గరగా పట్టుకుని చూస్తే, కార్డు వెనుకాల నల్లటి మ్యాగ్నిటిక్ స్ట్రిప్ ఉంటుంది లేదా ముందువైపు చిప్ ఉంటుంది లేదా ఈ రెండూ ఉండొచ్చు. కేవలం నల్లటి స్ట్రిప్ వున్న కార్డులు మోసాలకు అస్కారం ఎక్కువగా వుంటుందని, అందుచేతే ముందుబాగంలో చిప్ సెట్ వున్న డెబిట్ కార్డులను వినియోగంలోకి తీసుకురావాలని అర్బీఐ దేశంలోని బ్యాంకులన్నింటికీ అదేశాలను జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more