అర్దరాత్రి ఉద్యోగ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తేందుకు అటోను అశ్రయించి వెళ్తున్న మహిళా జర్నలిస్టును ఇద్దరు పోకరీలు బైక్ పై వెంబడించగా వారి అటను అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవం ద్వారా కట్టించేసిందామె. అయితే అమె చేసిన సంకేతాలకు అనుగూణంగా ముంబై పోలీసులు కూడా సకాలంలో స్పందించడంతో మహిళా జర్నలిస్టు సురక్షితంగా ఇంటికి చేరింది. అంతేకాదు.. రెండు రోజుల వ్యవధిలోనే మహిళా జర్నలిస్టును వెంబడించిన పోకిరీలను అరెస్టు చేశారు.
అటోలో ఎక్కిన జర్నలిస్టును గమనించి.. అమెను వెంబడిస్తూ వచ్చేందుకు వినియోగించిన బైక్ ను కూడా ముంబై పోలీసులు స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చారు. కాగా సకాలంలో స్పందించిన పోలీసులకు మహిళా జర్నలిస్టు ధ్యాంక్స్ చెప్పింది. పోలీసుల స్పందించిన తీరుపై ఏకంగా ముంబై పోలీసులందర్నీ హీరో చేసేసింది సోషల్ మీడియా. అన్ని ఠాణాల్లో పోలీసులు ఇలాగే చురుకుగా వుంటే.. నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కామెంట్లు కూడా పెడుతున్నారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర రాజధాని, దేశ అర్థిక రాజధానిగా బాసిల్లుతున్న ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వున్న తన కార్యాలయం నుంచి తన ఉద్యోగ విధులు ముగించుకుంది అసిరా ట్రన్నుమ్. ఇక జుహూ ప్రాంతంలోని తన నివాసానికి వెళ్లేందుకని అటోను అపింది. అటోలో బయలుదేరిన అమెను.. మార్గమధ్యంలో చిత్రకూట్ సమీపానికి చేరుకోగానే ఇద్దరు యువకులు 5994 నంబర్ గల టూ వీలర్ పై వెంబడించడం మొదలు పెట్టారు. పదే పదే ఆమెను చూస్తూ కామెంట్లు చేశారు.
దీంతో వారి అట కట్టించాలని భావించింది అసిరా ట్రన్నుమ్. అయితే పోకిరీలు ఆటోను ఛేజ్ చేస్తుంటే ఒకొంత భాయనికి కూడా గురైంది. అయినా ధైర్యం చేసి వారి ఫోటో తీయడంతో పాటు, సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలిపింది. అందకు ముంబై పోలీస్ అని ట్యాగ్ కూడా చేసింది. దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు, ఆమె సెల్ ఫోన్ ఆధారంగా ప్రయాణిస్తున్న దారిని ట్రాక్ లో ఉంచి, నిమిషాల్లో స్పందించారు. ఈలోగా ఇద్దరు యువకులు మాయమయ్యారు.
అయితే సాంకేతిక విప్లవంతో ఇలాంటి మంచి పనులు కూడా జరుగుతాయని అమె చెప్పడంతో పాటు ముందుగా ముంబై పోలీసులు వేగంగా స్పందించిన తీరు తనను కాపాడిందని అమె తెలిపింది. ఇక మహిళా జర్నలిస్టును వెంబడించిన ఇద్దరు పోకిరీలను రెండు రోజుల వ్యవధిలో పట్టుకున్న ముంబై పోలీసులు వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి కటకటాల వెనక్కి నెట్టారు. వారి వినియోగించిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రోడ్యూస్ చేశారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more