దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న వేళ.. దేశాంలో ఎన్నో ప్రతికూల అంశాలు కూడా ప్రభావితం చాటాయి. మరీ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ కొండ చరియలు విరిగిపడిన ఘటన, గోరక్ పూర్ లో 70 మంది చిన్నారులు మరణించిన విషాదంతో పాటు.. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్ష బీభత్సంతో వరదలు ఉప్పోంగి అనేక ప్రాంతాలను ముంపుకు గురిచేశాయి. ఈ క్రమంలో వచ్చిన జాతీయ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రకృతి వైపరిత్యం కూడా అడ్డుగా నిలవగా, ఆ పాఠశాల మాస్టారు మాత్రం తనదైన శైలిలో జాతీయ జెండాను అవిష్కరించి.. నెట్ జనులు మన్నన్నలను పోందుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారి నెట్ జనులు లైక్ లను పోందుతున్న ఈ ఫోటో వైరల్ అవుతోంది. అసోంను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. నడుంలోతు నీళ్లలో ఉన్న ఓ పాఠశాలలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లక్షల్లో నెటిజన్లు ఆ ఫొటోను లైక్ కొట్టి షేర్ చేస్తూ ప్రశంసిస్తున్నారు. దాని వివరాల్లోకివెళ్తే...అసోంలోని ధుబ్రి ప్రాంతంలోని నష్కర ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగురవేశారు. జెండా వందన కార్యక్రమానికి ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు.
వారిలో ఇద్దరు చిన్నారుల భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ వాళ్లు మాత్రం జెండా వందనం చేస్తూ నిలబడ్డారు. దీని గురించి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు మిజనూర్ రెహమాన్ వివరిస్తూ, సంబంధిత ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ‘ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము.. ఈ ఫొటోనే చెబుతుంది’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, ఫొటోలతో సహా తీసి విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, జిల్లా విద్యాధికారికి పంపారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more