కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పోరేట్ దిగ్గజాలకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి సంక్షేమం కోసమే పనిచేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించింది. దేశంలోని సుమారు 122 కోట్ల జనాభాలో దాదాపుగా రెండు కోట్ల మంది బాధపడుతున్న అంశంలో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఏడాదికి దేశవ్యాప్తంగా లక్షన్నర మంది మోకాలి చిప్పల మార్పిడి చేయించకుంటున్న క్రమంలో ఈ అంశాన్ని కేంద్రమంత్రి సీరియస్ గా తీసుకున్నారు.
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను గణనీయంగా తగ్గించిన కేంద్రం.. ఇకపై కార్పోరేట్ అసుపత్రులు బాధితుల నుంచి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న అరోపణలు వున్నాయని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అన్నారు. ఇకపై ఇలాంటి వాటికి అస్కారం ఉండకూడదని అదేశించారు. మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్స విషయంలో బాధితుల నుంచి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పిర్యాదులు అందితే సదరు అస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని ఆయన అదేశించారు.
వాస్తవ ధరల కన్నా ప్రైవేటు వైద్యశాలలు లక్ష రూపాయల మేర అధికంగా ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి… రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి. అక్రమంగా, అన్యాయంగా ప్రైవేటు వైద్యశాలలు రోగులను దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్.
కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విస్తృతంగా వాడే కోబాల్ట్–క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ. 1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. కొత్త ధరల కన్నా అధికంగా డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రులు, దిగుమతిదారులు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more