దేశ ప్రజలకు చెందిన 11 లక్షల పర్మినెంట్ అకౌంట్ నెంబరు (పాన్) కార్డులను డీయాక్టివేట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుని దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఓ వైపు అధార్ కార్డులను దేశపౌరులందరూ తీసుకోవాలని ప్రచారం చేస్తూనే.. మరో వైపు ఏకంగా 81 లక్షల అధార్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అధార్ కార్డుల జారీలో కొందరు అవకతవకలకు పాల్పడి అక్రమంగా పొందారన్న అనుమానాలు వున్న 81 లక్షల కార్డులను డీయాక్టివేట్ చేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధార్ సంఖ్యను జారీ చేయాలన్న లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
కాగా, ఇప్పటి వరకు 111 కోట్ల ఆధార్ కార్డులు జారీ కాగా, ఇంకా అనేక మంది అధార్ కార్డుల కోసం బారులు తీరుతునే వున్నారు. ఆధార్ కార్డు వల్ల పన్నుల ఎగవేత, నల్లధనాన్ని పోగేసుకోవడం వంటి అక్రమాలను నిరోధించవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో అక్రమంగా జారీ అయిన అధార్ కార్డులను నిలిపేసింది. అయితే వివిధ కారణాలను చూపుతూ ప్రభుత్వం 81 లక్షల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. మరి ఇందులో మీ ఆధార్ నెంబరు వుందా.,? అన్న అనుమానాలకు తావులేకుండా వెంటనే చెక్ చేసుకోండి.
చెక్ చేసుకునే విధానం:-
యూఐడీఏఐ వెబ్సైట్ https://uidai.gov.in లో లాగ్ ఆన్ అవాలి. దానిలోని ఆధార్ సర్వీసెస్ ట్యాబ్ క్రింద ‘వెరిఫై ఆధార్ నంబర్’ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో రెండు బాక్స్లు ఉంటాయి. ఒకదానిలో ఆధార్ సంఖ్యను టైప్ చేయాలి. రెండోదానిలో ఆ బాక్స్ పక్కనే ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి. అనంతరం మరొక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో పరీక్షిస్తున్న ఆధార్ సంఖ్య మనుగడలో ఉందా, లేదా? అనే విషయాన్ని వివరిస్తుంది. వ్యక్తి వయసు పదుల సంఖ్యలో తెలియజేస్తుంది. ఫోన్ నంబరు చివరి మూడు అంకెలు కనిపిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more