దేశ 13వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మాజీ కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరు ఇవాళే ఆయన రాజ్యసభ చైర్మెన్ గా కూడా బాధ్యతలను అందుకోనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెంకయ్య చేత ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు జాతీయ (భారత రాజ) బాష హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. దేశ రెండో అత్యున్నత పదవికి వెంకయ్యనాయుడు ఎన్నిక కావడం.. ఈ పదవిలో కొనసాగనున్న తొలి దక్షిణాది వ్యక్తి కావడం కూడా గమనార్హం.
అయితే ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన మనస్సులోని మాటలను చెప్పేందుకు మైకు ముందుకు వచ్చిన వెంకయ్య.. అక్కడున్న అధికారులను తాను మాట్లాడవచ్చా అని అడిగారు. అయితే అధికారులు అది ప్రోటోకాల్ కు విరద్దమని చెప్పడంతో ఏమీ మాట్లాడకుండానే ఆయన తనకు కేటాయించిన సీటులో అసీనులయ్యారు. ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్రపతి వేదికపై నున్న క్రమంలో ప్రసంగాలు చేయకూడదన్నది ప్రోటోకాల్. దీంతో వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తరువాత తొలి ప్రసంగానికి బ్రేక్ పడింది.
బీజేపి తలపండిన నేతగా, అపార అనుభవశాలిగా దేశంలోని రాజకీయాలపై, అవసరాలపై అవలీలగా మాట్లాడే వెంకయ్య.. రాజ్యసభ చైర్మన్ గా ఇక మాటాల్లడానికి బదులు వినడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపి అగ్రనేత లాల్ కిషన్ అద్వానీ, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more