తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం రేపిన విజయవాడ వైద్యురాలు డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యంపే రేగిన ఉత్కంఠ చివరకు విషాదాతంగ ముగిసింది. రైవస్ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో లభించిన అధారాల మేరకు పోలీసులు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృత గాలింపుల చేపట్టిన అనంతరం అమె మృతదేహాన్ని కాలువలోంచి వెలికితీశాయి. గత నెల చివరి రోజున అమె కనిపించకుండా పోవడంతో అమె అదృశ్యంపై నాలుగు రోజులుగా క్రితం కేసు నమోదైంది.
గాంధీనగర్ సమీపంలోని రైవస్ కాల్వలో అమె టూవీలర్ వాహనాన్ని గుర్తించిన పోలీసులు సూర్యకుమారి కాల్వలో దూకి ఉంటారని అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులకు తోడుగా విపత్తు నివారణ బృందాలు కూడా రంగంలోకి దిగి సుమారు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఆ కాల్వమొత్తం ప్రత్యేక బోటులతో గాలించడంతో ఓ రైల్వేగేటుకు సమీపంలోని రైవస్ కాలువలో ముళ్ల కంపలోచిక్కుకొని ఉన్న సూర్యకుమారి మృతదేహం గుర్తించి వెలికి తీశారు.
అయితే నాలుగు రోజులుగా కాలువలో సూర్యకుమారి మృతదేశం వుండటంతో దాదాపుగా కుళ్లిపోయిన స్థితికి చేరకుంది. దీంతో అమెను గుర్తుపట్టడం కొంత కష్టంగా మారింది. దీంతో పోలీసులు వారి కుటుంబసబ్యులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలమైన రైవస్ కాలువ వద్దకు చేరుకున్న సూర్యకుమారి కుటుంబ సభ్యులు తొలుత తమ బిడ్డ కాకూడదని దేవుడికి ప్రార్థించినా.. చివరకు అమె ధరించిన నగల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు.
ప్రేమ విఫలమైనందునే సూర్యకుమారి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. జగ్గయ్యపేటకు చెందిన అమె కుటుంబం కర్ణాటకలో స్థిరపడింది. అయితే, ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో సేవలందించేందుకు ఆర్నెళ్ల నుంచి విస్సన్నపేట క్లస్టర్ పరిధిలో తెల్లదేవరపల్లి ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ తో ఆమెకు ఆరేళ్లుగా పరిచయం ఉందని, అతడికి వివాహం కావడంతో పెళ్లికి నిరాకరించడంతోనే మనస్తాపానికి గురై ఆమె రైవస్ కాల్వ వంతెన వద్ద దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే సూర్యకుమారీ కుటుంబసభ్యులు మాత్రం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more