తన కళ్ల ముందే తండ్రి తూటా దెబ్బకు కుప్పకూలిపోయి పడి ఉన్న సన్నివేశం చూసిన ఏ కొడుకైనా మళ్లీ ఇలాంటి పని చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. 17 ఏళ్ల ప్రభ్ జ్యోత్ రాథోర్ తన తండ్రి చెప్పాడన్న ఒకే ఒక్క మాటను ఇప్పటికీ శిరసావహిస్తున్నాడు. ఘోర కలికి కేంద్రమైన మందిరంలో ప్రార్థనలో పాల్గొంటూనే ఉన్నాడు. ఐదేళ్ల క్రితం జరిగిన విస్కాన్సిన్ మారణహోమానికి నేటితో ఐదేళ్లు నిండాయి.
ఐదేళ్ల క్రితం ఆగష్టు 5, 2012 న విస్కాన్సిన్ సిక్కు మందిరంలోకి ప్రవేశించిన మైకేల్ ఫేజ్ అనే ఓ మహిళతో సహా వ్యక్తి ఆరుగురిని పొట్టనపెట్టుకున్నాడు. ఘటనలో ప్రభ్ జ్యోత్ తండ్రి కూడా మరణించాడు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఫేజ్ ను చంపేశాయ్. అప్పటిదాకా సిక్కు అనే ఓ జాతి ఉందన్న విషయం అమెరికాకు తెలియలేదు. నల్లజాతీయులపైనే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారిపై దాడులకు పాల్పడటానికి ఇదే బీజమైందని చెప్పుకోవచ్చు.
పెల్లు బిక్కిన జాతి వివక్షతపై తీవ్ర స్థాయిలో నిరసనలు వినిపించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండించాయి. అందులో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతితోపాటు ఆర్థిక సాయం అందింది. అయితే తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు ఇప్పటికీ ఈరోజును తలుచుకుని రోదిస్తూనే ఉంటారు.
‘‘నాకు అప్పుడు 12 ఏళ్లు. నాకు బాగా గుర్తుంది. ఇండియా నుంచి అప్పుడే అమెరికాకు వెళ్లాను. ఆరోజు అమ్మా, నేను, చెల్లి ప్రార్థన కోసం అక్కడికి(విస్కాన్సిస్ గురుద్వారా) వెళ్లాం. నాన్న వచ్చే వాళ్ల కోసం భోజనాలు సిద్ధం చేస్తున్నారు. నేను, పల్మిత్(చెల్లి) ఆడుకుంటున్నాం. అమ్మ మాకు కొద్ది దూరంలో ఉంది. ఇంతలో శబ్ధాలు వచ్చాయి. పటాసులు పేలుస్తున్నారేమో అనుకున్నా. కాసేపటికి అది తుపాకుల మోత అని అరుపులతో తెలిసిపోయింది. నాన్న చనిపోయాడంటూ ఓ వ్యక్తి వచ్చి చెప్పాడు. నాకేం అర్థం కానీ పరిస్థితి. ఆ మరుసటి రోజు ఏడుస్తున్న అమ్మను చూసి, నాన్న తిరిగి రాడని అర్థమైపోయింది.
ఇప్పుడు నాకు 17 ఏళ్లు. పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి వచ్చింది. చిన్నప్పుడు నాన్న చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. ప్రతీ ఆదివారం గురుద్వార్ లో జరిగే ప్రార్థనలకు వెళ్లి.. సహయక కార్యక్రమాల్లో పాల్గొంటే పుణ్యం వస్తుందని ఆయన చెప్పాడు. నాన్న చెప్పాడు. అందుకే ఆయన కోరికను తీరుస్తున్నా. ఆ విషాద ఘటనను దిగమింగుకుని ఇప్పటికీ అక్కడి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నా’’ అంటూ ప్రభ్ జ్యోత్ చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more