georgia performs last rites to orphan women body అనాధ శవానికి విదేశీ వనిత అంతిమ సంస్కారం

Georgia performs last rites to orphan women body

foreigner, georgia, secundrabad, gautam kumar, serve needy, last rites, orphan woman body, voluntary oragnisation, telangana, australia

A foreigner from australia, georgia who came to secundrabad kharkhana had performed last rites to orphan women body. She was amazed to known indian hindu culture.

అనాధ శవానికి విదేశీ వనిత అంతిమ సంస్కారం

Posted: 08/04/2017 12:25 PM IST
Georgia performs last rites to orphan women body

భారత పర్యాటనకు వచ్చిన ఓ విదేశీ మహిళ హిందూ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుని అవ్వాక్కయ్యారు. దేశంలో బతికున్న మనుషలుకే కాకుండా వారు తుది శ్వాస విడిచిన క్రమంలో నిర్వహించే క్రుతువులను తెలుసుకుని అశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు అనాధ మహిళా శవాన్ని తమ సోదరిగా భావించి అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ముఖపరిచయం కూడా లేని అనాధకు అన్ని తానై అంత్యక్రియలను నిర్వహించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఒక మనిషి తుది శ్వాస విడిస్తే ఇంత గొప్పగా వీడ్కోలు పలుకుతారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

సేవాభావంతో మనదేశంలో పర్యటిస్తోంది ఆస్ట్రేలియాకి చెందిన జార్జియా.. తన సేవా కార్యక్రమాలను భారతీయులకు అందించాలని సికింద్రాబాద్‌లోని కార్ఖానాలో ఉన్న ‘సెర్వ్‌ నీడీ’ స్వచ్ఛంధ సంస్థకు చేరకున్నారు. ఆ సంస్థకు సంబంధించిన 14 ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు మూడు రోజుల క్రితం నగరానికి వచ్చారు. తన వంతుగా అక్కడున్న అనాధ బాలబాలికలకు కావాల్సిన అవసరాలను తీర్చుతూ తన సేవాతాత్పరతను చాటుకుంటూనే వున్నారు.

తనలో  టాలెంట్‌తో కామెడీ, లాంగ్‌ స్విమ్మింగ్, వాయిస్‌ ప్లే వంటివి చేస్తూ.. వాటి ద్వారా వచ్చిన డబ్బును వివిధ సేవా సంస్థలకు దానం చేస్తున్నారు. అనాథ పిల్లల చదువులకు, కేన్సర్‌ రోగుల వైద్య ఖర్చులకు తన డబ్బు ఉపయోగపడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు జార్జియా. ‘సెర్వ్‌ నీడీ’ సేవా సంస్థ కార్యక్రమాల్లో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం కూడా వుంది. ఇదే క్రమంలో నగరంలోని ఓ షెల్టర్‌ హోమ్‌లో మరణించిన ఓ అనాధ మహిళకు అంత్యక్రియలు చేయాడానికి సర్వ్ నీడీ సంస్థ సన్నధమైంది.

ఈ క్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు గౌతమ్ కుమార్ ను ఒప్పించి.. అనాధ మహిళను తన సోదరిగా భావించి తాను అంతిమ సంస్కారాలు నిర్వహిస్తానని ముందుకు వచ్చారు జార్జియా. అంత్యక్రియల క్రతువులన్నీ తానే పూర్తి చేస్తానని తనకు అవకాశం ఇవ్వమని కోరారు. అందుకు సంస్థ వ్యవస్థాపకుడు అంగీకరించడంతో హిందూ సంప్రదాయం ప్రకారం తుది క్రతువులన్నీ తెలుసుకుని, అంత్యక్రియల్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా జార్జియా మాట్లాడుతూ మనిషికి వీడ్కోలు పలికే సమయంలో ఇక్కడి ఆచార వ్యవహారాలు, పద్ధతులు చాలా గొప్పగా అనిపించాయన్నారు. క్రతువుల గురించి తెలుసుకోవడం సంతోషంగా వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles